తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా మెడికల్ రిపోర్ట్ ఓకే- కానీ,​ ఛాంపియన్స్​ ట్రోఫీకి తీసుకోలేదు- ఎందుకంటే? - JASPRIT BUMRAH INJURY

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్- బౌలర్​ మెడికల్ రిపోర్ట్ ఓకే- అయినా అగార్కర్​ వద్దన్నాటడంట!

Jasprit Bumrah Injury
Jasprit Bumrah Injury (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 12, 2025, 4:48 PM IST

Jasprit Bumrah Injury :టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో యువ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అవకాశం కల్పించింది. అయితే గత కొంతకాలంగా ఎన్​సీఏ పర్యవేక్షణలో ఉన్న బుమ్రా కోలుకున్నాడట. అలాగే మెడికల్ రిపోర్టులు బాగానే ఉన్నాయట. అయినప్పటికీ టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ అతడిని దూరం పెట్టింది. ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మెడికల్ రిపోర్ట్ ఓకే ఉన్నప్పటికీ బుమ్రాను ఎందుకు తీసుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉంది. అదేంటంటే?

మెడికల్ రిపోర్ట్ ఓకే!
'బుమ్రా ఐదు వారాలపాటు ఎన్​సీఏ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కండిషనింగ్ కోచ్ రజనీకాంత్, ఫిజియో తులసి మార్గదర్శకత్వంలో రిహాబిటేషన్ పూర్తి చేసుకున్నాడు. దీనిపై ఎన్‌సీఏ చీఫ్ నితిన్ పటేల్ బీసీసీఐకి బుమ్రా ఆరోగ్య పరిస్థితిపై ఓ నివేదిక పంపాడు. అందులో బుమ్రా నేషనల్ క్రికెట్ ఆకాడమీలో రిహాబిటేషన్ పూర్తి చేసుకున్నాడని ఉంది. అలాగే బుమ్రా మెడికల్ రిపోర్ట్​ బాగానే ఉందని నితిన్ పేర్కొన్నారు'

'కానీ, టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ఉంటాడో లేదో తేల్చలేకపోయాడు. ఈ కారణంగానే సెలెక్టర్లు ఎటువంటి రిస్క్ తీసుకోలేదు. దీంతో బుమ్రాపై తుది నిర్ణయాన్ని ఎన్​సీఏ చీఫ్ అజిత్ అగార్కర్‌కు వదిలేశాడు. అయితే ఫిట్‌గా లేని ఆటగాడిని ఎవరు కూడా జట్టులోకి తీసుకునే రిస్క్ చేయరు. వైద్య బృందం పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే సెలక్షన్ కమిటీ రిస్క్ తీసుకోదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

అంటే మెడికల్ రిపోర్ట్ బాగానే ఉన్నప్పటికీ, టోర్నీ ప్రారంభానికి బుమ్రా బౌలింగ్ వేయడం అనుమానమే. అయినప్పటికీ జట్టులోకి తీసుకున్నా టోర్నీలో గాయం తీవ్రత పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ విషయంలో సెలక్షన్ కమిటీ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావించి బుమ్రాను ఎంపిక చేయలేదు!

ఆసీస్ టూర్​లో గాయం
ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ సందర్భంగా బుమ్రాకు వెన్నునొప్పి వచ్చింది. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో బౌలింగ్ చేయలేదు. అప్పటి నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)లో వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.

గతంలో ఓ సారి ఇలానే!
కాగా, 2022 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు ఎన్​సీఏ నివేదికగా ఆధారంగా బుమ్రాను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే సిరీస్ మధ్యలోనే బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో టీ20 ప్రపంచకప్ నుంచి వైదొల్సి వచ్చింది. దీంతో అప్పట్లో ఎన్​సీఏపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ఎడిషన్​లో టీమ్ఇండియా సెమీస్​లో ఇంగ్లాండ్​పై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీసీసీఐ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

'2022 టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ కోసం బుమ్రా ఫిట్ నెస్​పై నివేదికను ఇచ్చి నితిన్ నేతృత్వంలోని ఎన్​సీఏ విమర్శలు ఎదుర్కొంది. అప్పుడు టీమ్ఇండియా సెలక్టర్ చేతన్ శర్మ కాబట్టి బుమ్రాను జట్టులోకి తీసుకున్నాడు. అగార్కర్ అలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. బుమ్రాకు బదులుగా హర్షిత్​ను తీసుకున్నాడు' అని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్​ - జైస్వాల్ ప్లేస్​లో మరో స్టార్ - తుది జట్టులో కీలక మార్పులు

'బుమ్రా లేకపోతే కష్టమే!- ఛాంపియన్స్ ట్రోఫికి టీమ్ఇండియా బాగా వీక్​ అయిపోతుంది!'

ABOUT THE AUTHOR

...view details