Blind T20 World Cup 2024 : అంధుల టీ20 ప్రపంచ కప్ నవంబర్ 23 నుంచి డిసెంబరు 3 వరకు పాకిస్థాన్ వేదికగా జరగనుంది. తాజాగా ఈ టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వైదొలిగింది. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించడానికి భారత విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించింది.
వాస్తవానికి పాకిస్థాన్ దేశానికి వెళ్లడానికి అంధుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(NOC) లభించింది. కానీ, భారత జట్టును అక్కడికి పంపడానికి విదేశాంగ శాఖ మాత్రం ఆమోదం తెలపలేదు.
ఈ విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ వెల్లడించారు. దీంతో భారత జట్టు లేకుండానే టోర్నీ జరగనుంది.