తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​కు షాకిచ్చిన భారత్​ - టీ20 ప్రపంచ కప్​కు దూరం! - BLIND T20 WORLD CUP 2024

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు పాక్‌లో పర్యటించడానికి అనుమతిని నిరాకరించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

Blind T20 World Cup 2024
Blind T20 World Cup 2024 (source IANS)

By ETV Bharat Sports Team

Published : Nov 19, 2024, 5:27 PM IST

Blind T20 World Cup 2024 : అంధుల టీ20 ప్రపంచ కప్‌ నవంబర్ 23 నుంచి డిసెంబరు 3 వరకు పాకిస్థాన్‌ వేదికగా జరగనుంది. తాజాగా ఈ టోర్నీ నుంచి డిఫెండింగ్‌ ఛాంపియన్ భారత్​ వైదొలిగింది. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్​లో పర్యటించడానికి భారత విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించింది.

వాస్తవానికి పాకిస్థాన్‌ దేశానికి వెళ్లడానికి అంధుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(NOC) లభించింది. కానీ, భారత జట్టును అక్కడికి పంపడానికి విదేశాంగ శాఖ మాత్రం ఆమోదం తెలపలేదు.

ఈ విషయాన్ని భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ వెల్లడించారు. దీంతో భారత జట్టు లేకుండానే టోర్నీ జరగనుంది.

కాగా, వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం కూడా పాకిస్థాన్‌ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, తమ జట్టు దాయాది దేశంలో పర్యటించబోదని ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పింది. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించి, భారత్‌ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని కూడా కోరింది. కానీ దీనికి పాక్​ బోర్డ్​ అంగీకరించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అంధుల ప్రపంచకప్‌ నుంచి భారత్‌ వైదొలగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - టీమ్​ఇండియాతో కలిసిన యంగ్ పేసర్

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ : అత్యధిక పరుగులు, వికెట్లు- సిరీస్ హిస్టరీలో టాప్ ప్లేయర్లు!

ABOUT THE AUTHOR

...view details