Astrology Remedies to Preserve Assets: కొంత మంది పొలం, భూములు, ఇల్లు వంటివి ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు. మరికొందరికి తాతముత్తాతల నుంచి ఆస్తులు వస్తాయి. అంతా బాగుందీ అనుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో జీవితంలో ఎదురయ్యే అనుకోని కారణాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అలా కాకుండా స్థిరాస్తులు నిలబడాలంటే కొన్నితాంత్రిక పరిహారాలుచేసుకోవాల్సి ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. సంపాదించిన ఆస్తులు నిలబడడానికి చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలను ఇప్పుడు చూద్దాం.
పంచలోహ కూర్మం విధి :ఇంట్లో ఉత్తర దిక్కులో రాగి పళ్లెం ఉంచి అందులో పంచలోహాలతో తయారు చేసిన తాబేలు బొమ్మను పెట్టండి. అలాగే అక్కడ 21 రూపాయి నాణాలు ఉంచండి. ఇలా తాబేలు బొమ్మను ఉత్తర దిక్కులో ఉంచడం వల్ల స్థిరాస్తులు నిలబడతాయని మాచిరాజు తెలిపారు.
కుండ పరిహారం :గురువారం రోజున ఒక కొత్త కుండను ఇంటికి తెచ్చుకోవాలి. అయితే, ఎప్పుడైనా కుండ కొత్తది కొన్నప్పుడు దానికి చాక్పీస్తో ఇంటూ గుర్తు పెట్టుకుని తెచ్చుకోవాలట. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా మరణిస్తే కొత్త కుండ కొంటారు. ఆ దోషం రాకుండా ఉండడానికి X మార్క్ రాసి ఇంటికి తెచ్చుకోవాలి. ఆపై కుండకు పసుపు రంగు వస్త్రం చుట్టి ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయండి. మీ ఇంట్లో ఉత్తర దిక్కులో వేలాడదీస్తే చాలా మంచిది. మళ్లీ వచ్చే గురువారం రోజున ఆ కుండను తీసేసి మూలన పెట్టాలి. మళ్లీ అదే రోజున కొత్త కుండను కొనుగోలు చేసి పసుపు రంగు వస్త్రం చుట్టి వేలాడదీయాలి. ప్రతి గురువారం పాత కుండనీ తీసేసి కొత్త కుండను వేలాడదీయాలి. అలా 7 గురువారాలు చేయాలి. ఎనిమిదవ గురువారం రోజున ఆ కుండలను ఎక్కడైనా పారే నీళ్లలో వదిలేయాలి. లేదా ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో వేయాలి. ఇది జీవితంలో ఒక్కసారి చేస్తే ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయని మాచిరాజు పేర్కొన్నారు.