తెలంగాణ

telangana

స్థానిక సంస్థల్లో సత్తా చాటేలా ప్రణాళికలు - నేడే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం - TELANGANA BJP EXECUTIVES MEETING

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 8:16 AM IST

BJP Focus On Local Body Elections 2024 : రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఓట్లు, సీట్లు సాధించడంతో అదే ఉత్సాహన్ని సంస్థల ఎన్నికల్లో చూపాలని ఆ పార్టీ భావిస్తోంది. దాదాపు 9 నెలల తర్వాత ఇవాళ నిర్వహించనున్న విస్తృత రాష్ట్రకార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ హాజరుకానున్నారు.

BJP Focus On Local Body Elections
BJP Focus On Local Body Elections (ETV Bharat)

Telangana BJP Executives Meeting Today :దక్షిణాదిన తెలంగాణను గేట్‌వేగా ఎంచుకున్న బీజేపీ అసెంబ్లీతో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేకదృష్టి సారించింది. జాతీయనాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకుసాగుతూ బీఆర్ఎస్​, కాంగ్రెస్ వ్యూహాలని తిప్పికొట్టి మంచి ఫలితాలు సాధించింది. 2018లో కేవలం ఒక్క ఎమ్మెల్యేను గెల్చుకున్న కమలదళం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90శాతం ఓటు బ్యాంకుతోపాటు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని :ఆ తర్వాత 6 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా అధికార పార్టీకి సమానంగా 8 స్థానాలు 35శాతం ఓటింగ్‌శాతాన్ని కైవసంచేసుకొని సత్తాచాటింది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండటంతో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది. అదేఊపును త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కైవసం చేసుకొని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రణాళిక రచిస్తోంది.

నేడే రాష్ట్ర కార్యవర్గ సమావేశం :అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రకార్యవర్గ సమావేశం జరగ్గా నేడు విస్తృత రాష్ట్రకార్యవర్గ భేటీ నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ సహా రాష్ట్ర ఇన్​ఛార్జ్​లు సునీల్‌బన్సల్‌, తరుణ్‌చుగ్‌ హాజరుకానున్నారు. ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

Review On Election Results :కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనప్పటికీ హామీలు అమలుచేయకపోవడంపై సమావేశంలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో అనుసరించే వ్యూహంపైనా మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదు వేగవంతం, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

"రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజావ్యతిరేక కార్యకలాపాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్​ ప్రభుత్వంపై కార్యాచరణ ఉంటుంది. హస్తం పార్టీ ఇచ్చిన హామీల అమల్లో జాప్యంపై చర్చ ఉంటుంది. పార్టీని సంస్థాగతంగా విస్తరించడంతో పాటు, బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కొరకు సమాయత్తం కావడంపై చర్చిస్తాం. అతితక్కువ కాలంలోనే ప్రభుత్వాన్ని దోషిగా ప్రజలముందు నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది." - ఎన్వీఎస్​ ప్రభాకర్, బీజేపీ నేత

ప్రజావ్యతిరేక విధానాలపై :అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాద తీర్మానాలను, రాష్ట్ర విస్తృత కార్యవర్గంలో చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు చేయనున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నబీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకునేలా పావులు కదుపుతోంది.

ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం - ఆ అంశాలపై చర్చ!

Telangana BJP Meeting in Hyderabad Today : బీజేపీ కీలక సమావేశం.. ఎన్నికలు, తెలంగాణ విమోచన దినోత్సవంపై చర్చ

ABOUT THE AUTHOR

...view details