తెలంగాణ

telangana

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు సంరక్షణ చట్టం తీసుకురావాలి : వినోద్‌ కుమార్‌ - Vinod Kumar Fires on CM Revanth

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 3:35 PM IST

Updated : Aug 4, 2024, 3:46 PM IST

Ex MP Vinod Kumar Fires on CM Revanth : ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు.

Telangana Private Teachers on CM Revanth
Ex MP Vinod Kumar Comments on CM Revanth (ETV Bharat)

BRS Leader Vinod Kumar Comments on CM Revanth : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు సంరక్షణ చట్టం తీసుకురావాలని బీఆర్ఎస్​ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వినోద్​ కుమార్​ కోరారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా సంరక్షణ చట్టం కోసం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధ్యాయుల సమ్మేళనంలో సీఎం అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రైవేట్​ స్కూల్​లో పని చేస్తున్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్​లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రిపై ఫైర్​ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళితే అక్కడ వారిని మునగ చెట్టు ఎక్కిస్తారని వినోద్​ కుమార్​ ఎద్దేవా చేశారు. పోటీ ప్రపంచంలో అవునన్నా కాదన్నా చాలా మంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మనవలు, మనవరాళ్లను ప్రైవేటు స్కూల్​కే పంపే పరిస్థితి ఉంటుందన్నారు. తాను ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లను వేరుగా చూడటం లేదన్నారు.

"టీచర్ల మెప్పుకోసం ప్రైవేట్​ రంగంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులను కించపరిచే విధంగా సీఎం రేవంత్​ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడ ప్రైవేట్​ టీచర్లు, ప్రభుత్వం ఉపాధ్యాయులు అని వ్యత్యాసం చూడటం లేదు. ప్రైవేట్​ విద్యాసంస్ధల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ మిత్రులే​ కాదు. కేజీ టూ పీజీ వరకు ఉన్న అన్ని విద్యారంగ సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది కోసం ఒక చట్టం తీసుకురావాలి."-వినోద్ కుమార్, మాజీ ఎంపీ

ప్రైవేటు విద్యాసంస్థలకు ఒక చట్టం ఉండాలి : 2009 ఆగస్టులో విద్యా హక్కు చట్టం వచ్చిందని, రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారింది అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి మొత్తం 50 లక్షల మంది విద్యార్థులు ఉంటే, అందులో ప్రైవేటులోనే 51 శాతం ఉన్నారన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు బడులకు తరలి వెళ్లారని, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు.

త్వరలోనే లక్ష మంది ప్రైవేట్ ఉపాధ్యాయులతో సభ పెట్టి సంరక్షణ చట్టం కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒత్తిడి తెస్తామన్నారు. గతంలో మాజీ స్పీకర్ జి.నారాయణరావు చొరవతో న్యాయవాదులకు సంక్షేమ చట్టం వచ్చిందని, అది అన్ని రాష్ట్రాల్లో అమలవుతోందన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా సంరక్షణ చట్టం రావాల్సిందే అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులకు పీఆర్​సీ ఎప్పుడు ప్రకటిస్తారు? - సీఎం రేవంత్​కు హరీశ్ రావు లేఖ - Harish Rao Letter to cm Revanth

'ఏడు తరగతులు - ఓకే టీచర్​' కథనానికి స్పందన - మళ్లీ ఆ ముగ్గురు టీచర్లకు డిప్యూటేషన్ - GOVT REPSONSE TO ETV BHARAT STORY

Last Updated : Aug 4, 2024, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details