Prathidwani :దసరా అంటే సరదాల రోజు కాదు. సద్భావనలు పెంచుకునే రోజు. విజయదశమి అమ్మ పండగ. ఆ అమ్మ ఈ సృష్టి సమస్తానికీ తల్లి. అందుకే ఆమెను జగన్మాత అని పిలుస్తారు. దేవీ రూపంలో దైవాన్ని ఆరాధించడం వేదకాలం నుంచీ ఉంది. తెలంగాణలో బతుకమ్మ రూపంలో ఆరాధిస్తారు. అన్ని పండగల్లాగే దసరా కూడా ఐహిక, పారమార్ధిక, ఖగోళ, సామాజిక అంశాలతో ముడిపడింది. అసలు నవరాత్రులు ఎందుకు చేస్తారు? అమ్మవారికి ఒక్కో అవతార రూపంతో అలంకరణ చేయటం వెనుక పరమార్థం ఏంటి? అసలు ఇన్ని రూపాలు ధరించటం ఎందుకు? మన పండుగలు ప్రకృతితో ఎలా ముడిపడి ఉన్నాయి? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మి, సంస్కృత పండితులు, ప్రముఖ ప్రవచనకర్త తాడేపల్లి పతంజలి పాల్గొన్నారు.
పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసర ఉత్సవాలు - ఇక హంస వాహనంపై ఉత్సవమూర్తులకు పూజలు
విజయదశమి పండుగ వెనుక ఓ గాథ :అపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!
విజయాలకు నాంది విజయదశమి :విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.