తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వంద శాతం ఓటింగ్‌ లక్ష్యం సాధించేదెలా - ఇందుకోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? - Lok Sabha Elections 2024

Prathidwani Debate on Voting Awareness : ప్రజాస్వామ్యం మనుగడలో కీలకమైన ప్రక్రియ ఓటింగ్. ఎన్నికల్లో తమకు ఇష్టమైన నాయకులకు ఓటేసి గెలిపించుకోవడం ఓటర్ల ప్రాథమిక బాధ్యత. అలాంటిది ప్రతీ ఎన్నికకు ఓటింగ్ శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో మరింత తక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటి అన్న అంశంపై నేటి ప్రతిధ్వని

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 10:32 AM IST

Lok Sabha Elections 2024
Voting Awareness

Prathidwani Debate on Voting Awareness : ప్రజాస్వామ్యం మనుగడలో కీలకమైన ప్రక్రియ ఓటింగ్. ఎన్నికల్లో తమకు ఇష్టమైన నాయకులకు ఓటేసి గెలిపించుకోవడం ఓటర్ల ప్రాథమిక బాధ్యత. కానీ ప్రతీ ఎన్నికకు పోలింగ్ శాతం తగ్గిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లోనే పోలింగ్‌ శాతం తగ్గిపోతూ ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. రాష్ట్రంలో 2014 లోక్‌సభ ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో దాదాపు 6.46 శాతం పోలింగ్‌ తగ్గిపోయింది. ప్రజలకు ఓటింగ్‌పై ఇంతగా ఆసక్తి తగ్గిపోవడానికి కారణాలేంటి.

గత లోక్‌సభ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో పోలింగ్‌ 50 శాతం కూడా దాటలేదు. విద్యావంతులు ఎక్కువగా ఉండే నగరాల్లో పరిస్థితి ఎందుకిలా తయారైంది?. పోలింగ్‌ రోజు ఓటర్లు ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్‌కు కదిలివచ్చేలా చేయడమే అతిపెద్ద టాస్క్‌గా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి? ఓటు విలువ తెలిసిన విద్యావంతులు అధికంగా నివసించే నగరాల్లోనే పోలింగ్‌ శాతం ఎందుకు తగ్గిపోతోంది? ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న సమూహాలు ఏమిటి? వృద్ధులు, దివ్యాంగుల ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇదే నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details