ఈసారి దిల్లీపై పాగా వేసేదెవరో? - రాజధాని ఎన్నికల్లో త్రిముఖ పోరాటం - PRATIDWANI ON DELHI ELECTIONS
దిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకరిని మించి ఒకరు ఉచితాలు ప్రకటిస్తున్న పార్టీలు - ఈసారి మరింత ఆసక్తిగా రాజధాని శాసనసభ ఎన్నికలు - ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ తన అధికారాన్ని నిలుపోకోగలదా?
![ఈసారి దిల్లీపై పాగా వేసేదెవరో? - రాజధాని ఎన్నికల్లో త్రిముఖ పోరాటం PRATIDWANI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-01-2025/1200-675-23420162-thumbnail-16x9-delhi.jpg)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 28, 2025, 3:41 PM IST
Pratidwani on Delhi Assembly Elections : త్రిముఖ పోరులో హస్తిన గెలిచేది ఎవరు? ఫిబ్రవరి 5న జరగబోతున్న ఎన్నికల సమరానికి సంబంధించి సమీకరణాలు ఎలా ఉన్నాయి? అధికార ఆమ్ ఆద్మీ విపక్ష భాజపా, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకరిని మించి ఒకరు ఉచితాలు, వాగ్దానాలు ప్రకటిస్తున్నారు. మాటలతూటాలు ఎక్కుపెడుతున్నారు. కొత్తకొత్త పంథాల్లో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయినా ఓటరు నాడి పార్టీలకు చిక్కుతోందా? పార్టీల విధానాలు, నినాదాలు, ప్రచార సరళులు, ప్రజల స్పందనపై రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.