Loksabha Elections 2024 Bihar Begusarai Politics :లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్లోని బెగుసరాయ్ స్థానంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎన్నికల వాతావరణం భిన్నంగా ఉంటుంది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఫైర్ బ్రాండ్ గిరిరాజ్ సింగ్ మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యర్థి కూటమి నుంచి ఎవరు పోటీలో ఉంటారో అని బెగుసరాయ్ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల సమీకరణాలతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గిరిరాజ్ సింగ్కు పోటీగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ నుంచి ఏ అభ్యర్థిని బరిలో దింపుతారనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.
కన్హయ్యకు తోడుగా సినీనటుల ప్రచారం
Kanhaiya Kumar Lok Sabha :2019 లోక్సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యువనాయకుడు కన్హయ్య కుమార్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరుఫున బెగుసరాయ్ నుంచి బరిలో నిలిచారు. మోదీ పాలనను వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు బెగుసరాయ్లో కన్హయ్య తరుఫున ప్రచారం కూడా చేశారు. పలువురు సీనియర్ నాయకులు, షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ వంటి సినీనటులు బెగుసరాయ్లో కన్హయ్య గెలుపుకోసం ప్రచారం చేశారు. దీనికి తోడు లెఫ్ట్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు కూడా కన్హయ్య గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. ఒక దశలో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ను కన్హయ్య ఓడిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
BJP vs RJD Begusarai :కానీ కన్హయ్య కుమార్ గెలుపు అంత సులభం కాదు, ఎందుకంటే ప్రతిపక్ష కూటమి ధర్మాన్ని కాదని బెగుసరాయ్లో ఆర్జేడీ తన అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో కన్హయ్య కుమార్కు పడాల్సిన ఓట్లు పూర్తిగా చీలిపోయాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్కు 6లక్షల 92వేల ఓట్లు వచ్చాయి. కన్హయ్య కుమార్కు 2లక్షల 69వేల ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ తరపున పోటీచేసిన తన్వీర్ హాసన్కు లక్షా 98వేల ఓట్లు వచ్చాయి. దింతో కన్హయ్య కుమార్ దాదాపు నాలుగు లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
బెగుసరాయ్ని లెనిన్ గ్రాడ్ అని ఎందుకు పిలుస్తారు?
బెగుసరాయ్ను మినీ మాస్కో లేదా లెనిన్ గ్రాడ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. నిజానికి స్వాతంత్ర్యానికి ముందు భూమిహార్ భూస్వాములకు వ్యతిరేకంగా వామపక్షాలు ఫ్రంట్ను ఏర్పాటు చేశాయి. ఈ లెఫ్ట్ పార్టీలో భూమిహార్ నాయకులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ సింగ్ ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెబుతారు. ఆయన తండ్రి రామచరిత్ర సింగ్ బిహార్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖతో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కామ్రేడ్ చంద్రశేఖర్ సింగ్ వామపక్ష ఉద్యమంలో కొనసాగారు. అప్పటి నుంచి బెగుసరాయ్లోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వామపక్ష భావజాలం కనిపించడం ప్రారంభించింది. ఈ కారణంగానే బెగుసరాయ్ను లెనిన్ గ్రాడ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు.
ముందు టికెట్ వద్దన్నారు- కానీ
Bihar Politics :1952 నుంచి 2019 వరకు సీపీఐ నుంచి యోగేంద్ర శర్మ 1967లో ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలవగా, మిగిలిన సమయంలో జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, బీజేపీ పార్టీ ఎంపీలు ఇక్కడ జెండా ఎగురవేశారు. బెగుసరాయ్లో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు బీజేపీ పార్టీ ఆధిపత్యం చలాయించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత భోలా సింగ్ విజయం సాధించారు. అయన మరణాంతరం ఈ సీటు గిరిరాజ్ సింగ్కు దక్కింది. గిరిరాజ్ సింగ్ గతంలో నవాడా నుంచి ఎంపీగా ఉన్నారు. బెగుసరాయ్ నుంచి పోటీకి గిరిరాజ్ సింగ్ ముందు విముఖత చూపించారు. అయితే పార్టీ ఆయనను బుజ్జగించి ఒప్పించింది. దీంతో ఆయన బెగుసరాయ్ నుంచి ఎన్నికల బరిలో దిగడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత భారీ మెజారిటీతో గెలిచి మోదీ క్యాబినెట్లో మంత్రి హోదా కూడా సంపాదించారు.