తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

భారత్​లో విదేశీ టూరిస్టులు వెతికిన టాప్ 10 ప్రాంతాలు ఇవే! - అవేంటో మీకు తెలుసా?

- రిపోర్ట్ విడుదల చేసిన "బుకింగ్ డాట్ కామ్" - తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రాంతం

By ETV Bharat Features Team

Published : 5 hours ago

Foreigners Most Searched Places
Foreigners Most Searched Places (ETV Bharat)

Foreigners Most Searched Places in India:భారతదేశాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. మన దేశంలో ఫేమస్ టూరిస్టు ప్లేసులు ఏమేం ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అంటూ.. ఆన్​లైన్​లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. మరి.. ఈ మేరకు "బుకింగ్ డాట్ కామ్" అనే పర్యాటక సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది. మరి ఇందులో ఉన్న టాప్​ 10 ప్రాంతాలు ఇవే.

దిల్లీ:ఈ జాబితాలో దేశ రాజధాని దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. దిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, ఇండియా గేట్, హుమాయున్ టూంబ్స్ వంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ముంబయి:'ద సిటీ ఆఫ్ డ్రీమ్స్​', దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబయి ఎల్లప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడికి విదేశీయులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చారిత్రక గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్​ లాంటి ప్రదేశాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

బెంగళూరు:టెక్నాలజీ క్యాపిటల్​గా పిలుచుకునే కర్ణాటక రాజధాని బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే లాల్​బాగ్ బొటానికల్ గార్డెన్, బెంగళూరు ప్యాలెస్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదే కాకుండా అనేక చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో విదేశీ పర్యటకలు ఆసక్తి చూపిస్తారు.

చెన్నై:ఆ తర్వాత స్థానంలో తమిళనాడురాజధాని చెన్నై నిలిచింది. దీనికి సమీపంలో ఉండే అతి పురాతన ఆలయాలు, సంస్కృతి.. విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మెరీనా బీచ్, మహాబలేశ్వరం, కపాలేశ్వర ఆలయం, సెయింట్ జార్జ్ కోట చెన్నైలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

హంపీ:ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపీని విదేశీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు. కర్ణాటకలోని హంపీ యూనెస్కో వారసత్వ గుర్తింపు సైతం పొందింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండే పురాతన ఆలయాలు, కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యటకులు వస్తారు.

లెహ్:విదేశీ పర్యటకులు ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రాంతాల జాబితాలో లద్దాఖ్​లో భాగమైన లెహ్ ఆరో స్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి ఎత్తైన హిమాలయాలను చూసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రకృతి ప్రేమికులు, ట్రావెలర్స్ హిమాలయాలు చూడడంతో పాటు ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి ఎక్కువగా వస్తారు.

పాట్నీ టాప్:జమ్ము కశ్మీర్​ ఉధంపుర్​ జిల్లాలోని పాట్నీ టాప్​ ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే శివాలిక్ కొండల నుంచి సూర్యోదయం, సూర్యస్తమయం, పచ్చికబయళ్లను చూసేందుకు విదేశీ పర్యటకులు ఆసక్తి చూపిస్తారు.

పహల్ గామ్:ఈ జాబితాలో ఎనిమిదో స్థానం కూడా జమ్ము కశ్మీర్​లోని పహల్ గామ్ దక్కించుకుంది. అనంత్​నాగ్ జిల్లాలో ఉండే బెతాబ్ వ్యాలీ, అరు వ్యాలీ విదేశీ పర్యటకులను బాగా ఆకట్టుకుంటాయి.

కూర్గ్:కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలోని మదికెరి తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఉండే కోట, కాఫీ తోటలు, కొండలు, జలపాతాలను చూసేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

విజయవాడ:ఇక పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ నిలిచింది. ఇక్కడ ప్రవహించే కృష్ణా నది, కనకదుర్గ ఆలయం, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కేవ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ - ఆరు రోజుల పాటు మేఘాలయ, అస్సాం అందాలు చూడొచ్చు!

ABOUT THE AUTHOR

...view details