తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మహా శివరాత్రికి IRCTC సూపర్ ప్యాకేజీ - హైదరాబాద్​ నుంచి జ్యోతిర్లింగాల టూర్ - IRCTC JYOTIRLINGA DARSHAN PACKAGE

- మధ్యప్రదేశ్​లోని జ్యోతిర్లింగాల దర్శనానికి తక్కువ ధరకే 6 రోజుల టూర్​

IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package
IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2025, 4:47 PM IST

IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package: మరికొన్ని రోజుల్లో శివరాత్రి రానుంది. ఈ పర్వదినం వేళ చాలా మంది పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. మరి మీరు కూడా శివరాత్రి వేళ శివయ్యను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్​. పండగ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండింటిని ఓకే ట్రిప్​లో దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్​ అవుతాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలు సహా మరికొన్ని దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్​సీటీసీ 'మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌' పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా ఉంటుంది. టూర్​ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారమూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్​ ట్రైన్​ జర్నీ ద్వారా ఈ టూర్​ను ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణం ఇలా:

  • మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్‌ నెం.12707) బయల్దేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌కు వెళ్లి చెకిన్​ అయ్యి ఫ్రెషప్​ అవుతారు. ఆ తర్వాత సాంచి స్థూపం విజిట్​ చేస్తారు. అనంతరం భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ను దర్శించుకుని తిరిగి భోపాల్‌ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్‌ మ్యూజియం విజిట్​ చేసి ఆ రాత్రికి భోపాల్‌లోనే స్టే చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ చేశాక చెక్​ అవుట్​ చేసి ఉజ్జయినికి బయల్దేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మహేశ్వర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ అహిల్యాదేవి కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్​కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి ఓంకారేశ్వర్​లో బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత ఇందౌర్​కు బయల్దేరుతారు. అక్కడ లాల్​బాగ్​ ప్యాలెస్​, గణేష్​ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. రాత్రి 8 గంటలకు రిటర్న్​ జర్నీ(ట్రైన్‌ నెం: 19301) స్టార్ట్​ అవుతుంది. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌ చేరుకోవటంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే:

1 - 3 ముగ్గురు ప్రయాణికుల కోసం :

  • కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్​కి రూ.36,190, ట్విన్ షేరింగ్‌కు రూ.20,360, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,880 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.12,010, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,110 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో సింగిల్ షేరింగ్​కి రూ.33,680, ట్విన్ షేరింగ్‌కు రూ.17,850, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,600 చెల్లించాలి.

నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే :

  • కంఫర్ట్‌లో డబుల్‌ షేరింగ్‌కు రూ.16,730, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.14,330 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 12,010, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,110 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో డబుల్‌ షేరింగ్‌కు రూ. 14,220, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.11,820 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,600 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు(హైదరాబాద్​ - భోపాల్​/ఇందౌర్​ - హైదరాబాద్​)
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • హోటల్​ అకామిడేషన్​
  • బ్రేక్​ఫాస్ట్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ప్రకటించిన తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఈ టూర్‌కు సంబంధించిన ఇతర వివరాలు, టికెట్ల బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్‌ చేయండి.

శివరాత్రి వేళ శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుంటారా? - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ - ఈ ప్రదేశాలూ చూడొచ్చు!

IRCTC కర్ణాటక టూర్​ - ఆరు రోజుల పాటు ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు! - పైగా ధర తక్కువ!

ABOUT THE AUTHOR

...view details