Anjeer Benefits in Telugu:ప్రస్తుతం మధుమేహం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ బాధిస్తోంది. ఇది ఒక్కసారి వస్తే ఇక జీవితాంతం మందులు తప్పక వాడాల్సిందే! అందుకే దీనిని నివారించుకునేందుకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుకునేందుకు అంజీర్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో తింటే ఊహించని ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. అంజీర్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం రోగులు అంజీర్ పండ్లను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు. అంజీర్ పండ్లలో పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిరూపించాయని చెబుతున్నారు.
2019 Nutrition Research జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు అంజీర్ పండ్ల తినడం వల్ల షుగర్(రిపోర్ట్) నియంత్రణలో ఉంటుందని కనుగొన్నారు. దీంతో పాటు అంజీర్లను తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతాయని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధనలో Punjab Agricultural Universityలో Food Science and Technologyలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ S. C. Sharma పాల్గొన్నారు.
ఈ ప్రయోజనాలు కూడా:
మలబద్ధకం సమస్య ఉన్నవారు:అంజీర్ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు రోజూ పరగడుపునే నానబెట్టిన రెండు అంజీర్ పండ్లను తినాలని సూచిస్తున్నారు. ఇవి ప్రేగు కదలికలను సరిచేసి.. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరిస్తున్నారు. అలాగే, పొట్ట ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అంటున్నారు.
బరువు తగ్గేందుకు సాయం:చాలా మంది బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, అంజీర్ పండ్లలో పుష్కలంగా లభించే ఫైబర్.. బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఆహారమని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలా అని మరీ ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతారని.. రోజుకు రెండుకు మించి తినకూడదని తెలుపుతున్నారు.