తెలంగాణ

telangana

షుగర్​ నార్మల్​కి వస్తే మందులు ఆపేయవచ్చా? - నిపుణుల సమాధానం ఇదే! - Diabetes and Medication

By ETV Bharat Health Team

Published : Sep 16, 2024, 2:06 PM IST

Updated : Sep 18, 2024, 1:44 PM IST

Can a Diabetic Patient Stop Medicine : షుగర్ ఉన్నవారు నిత్యం మందులు వాడాల్సిందేనని నిపుణులు సూచిస్తారు. అయితే.. మందులు వేసుకునే క్రమంలో షుగర్ లెవల్స్ నార్మల్​ అవుతుంటాయి. అలాంటప్పుడు కొందరు మందులు వేసుకోవడం ఆపేస్తుంటారు. మరి ఇలా చేయడం మంచిదేనా?

Can a Diabetic Patient Stop Medicine
Can a Diabetic Patient Stop Medicine (ETV Bharat)

Can People with Diabetes Stop Taking Medicine :డయాబెటిస్ బాధితుల్లో కొందరు..షుగర్ లెవల్స్ నార్మల్​కి రాగానే, అంతా బాగానే ఉందనే భావనతో ​మందులు తీసుకోవడం మానేస్తుంటారు. మరి.. మధుమేహ బాధితులు ఇలా మందులు మధ్యలో వేసుకోకపోవడం మంచిదేనా? అంటే "కాదు" కాదంటున్నారు ప్రముఖ జనరల్​ ఫిజిషీయన్​ 'డాక్టర్​ శ్రీనివాస్​'. మందులు వేసుకోవడం ద్వారానే షుగర్​ కంట్రోల్లో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్​ మందులు వేసుకోవడం మానేస్తే బ్లడ్​ షుగర్ స్థాయులు తప్పకుండా పెరుగుతాయని చెబుతున్నారు.

అది మన పొరపాటే!

దాదాపు షుగర్​ ఉన్నవారందరిలో మెడిసిన్​ తీసుకోవటం వల్లనే గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంటాయి. కొంతమంది కొన్ని నెలలు కంటిన్యుగా మందులు వాడడం వల్ల.. డయాబెటిస్​ వెనక్కి మళ్లిందనీ భావిస్తుంటారు. కానీ, మధుమేహం వెనక్కి మళ్లటమనేది చాలా కొద్దిమందిలోనే జరుగుతుందట. అది కూడా జబ్బు నిర్ధరణ అయిన తొలి సంవత్సరాల్లోనే. రోజూ కచ్చితంగా మంచి జీవనశైలిని పాటించటం, బరువు తగ్గటం, మందులు వేసుకోవటం మూలంగా సాధ్యమవుతుందట. కాబట్టి, షుగర్​ పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవడం మన పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి వారు మధ్యలో ఆపేయవద్దు..

కొంతమంది షుగర్​ బాధితులు ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మెడిసిన్​ తీసుకుంటేనే షుగర్​ లెవెల్స్​ కంట్రోల్లో ఉంటాయి. అయితే, ఇలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వేసుకోవడం మధ్యలో ఆపేయవద్దు. ఒకవేళ మందులు తీసుకోవడం ఆపేస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మందులు మానేస్తే ఏమవుతుంది ?

చాలామంది మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజు నియంత్రణలో లేకపోయినా.. పైకి ఎలాంటి ఇబ్బందులూ కనిపించవు. దీంతో వారు మునుపటిలానే ఆరోగ్యంగా ఉన్నానని భావిస్తుంటారు. కానీ, ఇది పెద్ద పొరపాటు. ఒక్కసారి ఉన్నట్టుండి డాక్టర్​ సూచించిన మందులు ఆపేస్తే గ్లూకోజు మోతాదులు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు, రక్తంలో ఆమ్లాలు పోగుపడే (డయాబిటిక్‌ కీటోఅసిడోసిస్‌) ముప్పు పెరుగుతుంది.

మధుమేహం ఒక సైలెంట్​ కిల్లర్​ వ్యాధి. త్వరగా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా.. అన్ని అవయవాలపైనా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చూపు తగ్గిపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్​, కాళ్లకు పుండ్లు పట్టడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందిలో కాళ్లకు పుండ్లు పడి మానకపోతే తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి, షుగర్​ బాధితులు డాక్టర్​ సూచించిన మందులు తప్పకుండా వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే!

మధుమేహం​తో తీవ్రంగా బాధపడుతున్నారా? - పరిశోధకులు సూచిస్తున్న డైట్ ఇదే!

Last Updated : Sep 18, 2024, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details