Prabhas The Raja Saab Glimpe :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో డైరెక్టర్ మారుతి తెరక్కెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాజాసాబ్'. హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వింటేజ్ డార్లింగ్ ఈ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఈ గ్లింప్స్లో ప్రభాస్కు ఒక్క డైలాగ్ కూడా లేదని కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ మారుతి స్పందించారు. 'గ్లింప్స్లో ఒక్క డైలాగైనా పెట్టొచ్చు కదా అన్నా' అని ఓ అభిమాని అడగ్గా, అవన్నీ టీజర్లోనే అంటూ మారుతి సమాధానమిచ్చారు.
తాజాగా విడుదలైన గ్లింప్స్లో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ను రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభాస్తో పాటు మాళవిక మోహనన్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.