తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రావణుడిగా నటిస్తున్నా - సాయి పల్లవిని ఆయనే సెలక్ట్ చేశారు'

రామాయణపై హీరో యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - ఏం చెప్పారంటే?

Yash Saipallavi Ramayana Movie
Yash Saipallavi Ramayana Movie (source Getty Images and ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Yash Ramayana Movie : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అతి పెద్ద సినిమాగా రానుంది రామాయణ. బాలీవుడ్​ భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్​ యశ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే చిత్రంలో రావణుడిగానూ నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.

తాజాగా దీనిపై యశ్ స్పందించారు. రావణుడి పాత్ర చేయడం నిజమేనని స్పష్టత ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నార్త్, సౌత్​ నటులను రామాయణలో భాగం చేయాలనుకున్నాం. హీరోయిన్‌గా సాయి పల్లవిని దర్శకుడు నితేశ్‌ తివారీనే తీసుకున్నారు. ఒకవేళ సినిమాలో నన్ను మరో పాత్ర ఏదైనా చేయమంటే నటించేవాడిని కాదేమో. ఓ నటుడిగా రావణుడి పాత్ర చేయడం నాకు ఇష్టం. ఆ క్యారెక్టర్‌లో పలు షేడ్స్‌ ఉంటాయి" అని అన్నారు.

ఇంకా తాజా ఇంటర్వ్యూలో కేజీయఫ్ 3, సలార్​, టాక్సిక్ సినిమాల గురించి కూడా మాట్లాడారు యశ్. "టాక్సిక్​ సినిమా మాసీ, మెగా ఎంటర్​టైన్​మెంట్​ ఫిల్మ్​గా ఉంటుంది. అయితే ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్టు 2025 ఏప్రిల్​లో రావట్లేదు. వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ సరైన సమయంలో ప్రకటిిస్తాం. గీతూ మోహన్‌దాస్‌కు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. గతంలో ఆమె ఎలాంటి చిత్రాలు చేశారు, వాటి ఫలితమేంటి? అనేది కాకుండా ప్రస్తుతం ఆమె ఏం కథ చెప్పాలనుకుంటున్నారనేది చూశాను. ఈ చిత్రంలో మహిళా పాత్రలు చాలా ఉన్నాయి. ఆ హీరోయిన్ల పేర్లను త్వరలోనే తెలియజేస్తాం. DNEG కంపెనీ టాక్సిక్​ వీఎఫ్​ఎక్స్​ పనులు చేస్తోంది. దీంతో నేను లాస్‌ ఏంజెల్స్‌ వెళ్లాను. అప్పుడే ఆ సంస్థ సీఈవో నమిత్‌ మల్హోత్రను కలిశాను. ఆయనే 'రామాయణ' టాపిక్‌ తీసుకొచ్చి, ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడట్లేదని చెప్పారు. భారతీయ చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఆయన విజన్‌ నన్ను ఆకర్షించడంతో రామాయణ ప్రాజెక్టుకు సహ నిర్మాతలుగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. " అని చెప్పారు. ఇకపోతే ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్​ దాస్​ తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఆ కనెక్షన్‌ ఉండదు - 'కేజీయఫ్ 3' రామాయణ, టాక్సిక్​ సినిమాలు రిలీజ్ అయ్యాక తెరకెక్కుతుందని చెప్పారు యశ్. "ఆ సినిమాల రిలీజ్​ తర్వాత ప్రశాంత్ నీల్ ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు పూర్తి చేస్తా. సరైన సమయంలో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. అలానే సోషల్‌ మీడియాలో రూమర్స్‌ వచ్చినట్టుగా సలార్​కు కేజీయఫ్​కు సంబంధం ఉండదు." అని యశ్ పేర్కొన్నారు.

రామ్‌ చరణ్‌ అరుదైన ఘనత - అమితాబ్‌, షారుక్​ సరసన చోటు

'జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే - రజనీకాంత్ విషయంలో అలా చేశా'

ABOUT THE AUTHOR

...view details