MANUSHI CHILLARBOYFRIEND VEER PAHARIYA : మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ - మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బాలీవుడ్ సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒకరు పోస్ట్ చేసిన వ్లాగ్లో మానుషి, వీర్ భుజంపై విలాసంగా తలపెట్టి సేద తీరటం కనిపించింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్రీ - తాను జాన్వీకపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియా, ఇతర స్నేహితులతో కలిసి టూర్కు వెళ్లినట్లు ఒక వ్లాగ్ షేర్ చేశాడు. పోస్ట్ చేసిన వీడియోకు జాన్వీ ఫొటోషూట్తో బిజీగా ఉన్నారంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఆ ఫోటో ఘాట్లో జాన్వీ పక్కన మానుషి, వీర్ కలిసి కనిపించారు. వీర్ భుజంపై తల పెట్టుకొని మానుషి చిల్లర్ సేదతీరుతూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా ఈ జంట కలిసి కనిపించింది. కలిసి చిందులేసి అందర్నీ ఆకట్టుకుంది.
కాగా, హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వసుందరిగా విజయం సాధించిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్కుమార్ హీరోగా తన తొలి చిత్రంలో నటించింది. అనంతరం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడేమియా ఛోటే మియా వంటి సినిమాలు చేసింది. ఆపరేషన్ వాలెంటైన్లో నటించి తెలుగువారికి కూడా పరిచయం అయ్యింది.