Gold Rate Today February 24th 2025 :దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.88,940 ఉండగా, సోమవారం నాటికి రూ.140 పెరిగి రూ.89,080కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.99,099 ఉండగా, సోమవారం నాటికి రూ.49 పెరిగి రూ.99,148గా చేరుకుంది.
- Gold Price In Hyderabad February 24th 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.89,080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,148గా ఉంది.
- Gold Price In Vijayawada February 24th 2025 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.89,080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,148గా ఉంది.
- Gold Price In Visakhapatnam February 24th 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.89,080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,148గా ఉంది.
- Gold Price In Proddatur February 24th 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.89,080గా ఉంది. కిలో వెండి ధర రూ.99,148గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price February 24th 2025 : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2,935 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2,941 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.68 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today February 24th 2025: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ ఈ వారాన్ని నష్టాలతో మొదలుపెట్టాయి. అమెరికా టారిఫ్ భయాలకు తోడు దేశీయంగా కార్పొరేట్ సంస్థల డిసెంబరు త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటం, షేర్ల అధిక విలువలు, జీడీపీ వృద్ధిపై ఆందోళనల వల్ల మదుపర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 539 పాయింట్లు తగ్గి 74,771 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 164 పాయింట్లు కుంగి 22,631 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు :డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్
- నష్టాల్లో ఉన్న షేర్లు : ట్రెంట్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఓఎన్జీసీ
రూపాయి విలువ
Rupee Value February 24th 2025 : డాలర్తో రూపాయి మారకం విలువ రూ.86.58 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices February 24th 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.