తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంభమేళాలో తొక్కిసలాట- 20 మంది మృతి! 100 మందికి గాయాలు - STAMPEDE AT KUMBH MELA

మహా కుంభమేళాలో తొక్కిసలాట- పలువురు భక్తులకు తీవ్ర గాయాలు

Stampede At Kumbh Mela 2025
Stampede At Kumbh Mela 2025 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 6:22 AM IST

Updated : Jan 29, 2025, 11:28 AM IST

Stampede At Kumbh Mela 2025 :మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు.

ప్రధాని మోదీ ఆరా
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. గంటలో మూడు సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు, సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. "త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు" అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.

కుంభమేళా మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌
కుంభమేళాకు భక్తులు పోటెత్తడం వల్ల అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే తొక్కిసలాట ఘటన తీవ్రమైనది కాదని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా తెలిపారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు.

అయితే బుధవారం ఒక్కరోజే 10 కోట్లమంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణీసంగమ ప్రాంతాన్ని కొన్ని రోజులపాటు నో వెహికల్‌ జోనుగా ప్రకటించారు. సాయంత్రం 6.45 గంటలకు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాళ్ల గులాబీ పూలవర్షం కురిపించనున్నారు. వివిధ అఖాడాల నుంచి సాధువుల ఊరేగింపులు ఉంటాయి. 1 నుంచి 8 తరగతుల స్థానిక విద్యార్థులకు జనవరి 28, 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అలహాబాద్‌ హైకోర్టు సైతం మౌనీ అమావాస్యకు బుధవారం సెలవుగా ప్రకటించింది. కుంభమేళా చరిత్రలో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల నుంచి 22 మంది సాధువులు, వేలాదిగా భక్తులు అమృత స్నానాలకు ప్రయాగ్‌రాజ్‌కు విచ్చేశారు. మౌనీ అమావాస్య సందర్భంగా రైల్వేశాఖ మొత్తం 360 రైళ్లను నడుపుతోంది.

Last Updated : Jan 29, 2025, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details