తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ను ఒక ముప్పుగా చూపేందుకు బంగ్లాదేశ్​లో కుట్ర : RSS చీఫ్

RSS Chief Mohan Bhagwat Speech : భారత్​ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్​లో కుట్రలు జరుగుతున్నాయని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ ఆరోపించారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

RSS Chief Mohan Bhagwat
RSS Chief Mohan Bhagwat (ANI)

RSS Chief Mohan Bhagwat Speech :భారత్​ను ఒక ముప్పుగా చూపించేందుకు బంగ్లాదేశ్​లో కుట్రలు జరుగుతున్నాయని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్​ ఆరోపించారు. "మన సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. హిందువులను శత్రువులుగా చూసే పరిస్థితి తీసుకువస్తున్నారు. మన సంకల్పాన్ని బలహీన పరిచేందుకు, భారత్​ను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు" అని మోహన్ భగవత్​ ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్​లో నిరంకుశ ఛాందసవాదం రాజ్యమేలుతోందని ఆరోపించారు. అక్కడి హిందువులతో సహా మైనారిటీల తలలపై కత్తి వేలాడుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నాగ్​పుర్​లో ఆర్​ఎస్​ఎస్​ విజయదశమి ఉత్సవ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయుధ పూజ చేసిన మోహన్ భగవత్​ బంగ్లాదేశ్​లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

నేరస్థులను రక్షించే ప్రయత్నం!
మహిళలపై అకృత్యాలపై ఆర్​ఎస్​ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్​కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన మన సమాజానికి సిగ్గుచేటని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. నేరం జరిగి ఇంతకాలమైనా, బాధితురాలికి న్యాయం జరగకపోవడం సమాజాన్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోందని అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

"కోల్​కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నేరస్థులను రక్షించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. నేరాలు, దుష్ట రాజకీయాలు, విష సంస్కృతి మనల్ని నాశనం చేస్తున్నాయి."
-మోహన్ భగవత్, ఆర్​ఎస్​ఎస్ చీఫ్

ఆర్​ఎస్​ఎస్​కు వందేళ్లు
ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటై 100వ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో, ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ సహా ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఇస్రో మాజీ ఛైర్మన్లు రాధాకృష్ణన్‌, శివన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక ఐక్యత, సామరస్యం కోసం కుల, మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలంటూ సంఘ్‌ కార్యకర్తలను ఉద్దేశించి భగవత్‌ ప్రసంగించారు. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను ఖండించారు. మనమున్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉంటే, ఎలాంటి ఘర్షణలకు తావుండదన్నారు. అలాగే ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details