తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే స్టేషన్​లో వ్యక్తి బీభత్సం- కర్రతో ప్రయాణికులపై దాడి- ఇద్దరు మృతి - Man Attacked Passengers In Nagpur

Man Attacked Passengers In Nagpur : మహారాష్ట్రలోని నాగ్​పుర్ రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. కర్రతో ప్రయాణికులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

Man Attacked Passengers In Nagpur Railway Station
Man Attacked Passengers In Nagpur Railway Station (ETV Bharat)

Man Attacked Passengers In Nagpur Railway Station :మహారాష్ట్రలోని నాగ్​పుర్ రైల్వే స్టేషన్​లో మతిస్థిమితం లేదని భావిస్తున్న ఓ వ్యక్తి చేసిన దాడిలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరిని తమిళనాడు దిండిగల్​కు చెందిన గణేశ్​ కుమార్​గా గుర్తించారు. మరో బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రైల్వే ట్రాక్​ల్లో ఉపయోగించే కర్రతో ఏడో నంబర్​ ప్లాట్​ఫామ్​పై వేచిచూస్తున్న ప్రయాణికులపై నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి చేసి పారిపోతున్న నిందితుడిని రైల్వే ఉద్యోగులు పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details