BCCI Special Gift For T20 World Cup Winners : గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో విజయం సాధించిన టీమ్ఇండియాకు తాజాగా బీసీసీఐ ఓ విలువైన బహుమతిని ఇచ్చింది. ఆ జట్టులోని మెంబర్స్కు డైమండ్ రింగ్స్ను అందించింది. రీసెంట్గా జరిగిన బీసీసీఐ అవార్డుల వేడుకల్లో ప్లేయర్లకు ప్రత్యేకంగా తయారు చేసిన ఆ ఉంగరాలను ప్రెజెంట్ చేసింది.
ఈ క్రమంలో తాజాగా ఆ రింగ్స్ గురించి వివరంగా చెబుతూ గురువారం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో నీలం, బంగారు వర్ణంతో ఉన్న ఉంగరంపై భాగంలో టీ20 ప్రపంచ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలను పొందుపరిచారు. అంతేకాకుండా ఆ రింగ్పై అశోక చక్రం గుర్తు కూడా ఉండటం విశేషం. ఇక ఉంగరానికి అటు ఇటూ ప్లేయర్ల పేర్లతో పాటు వారి జెర్సీ నంబర్లు, టీమ్ఇండియా ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాన్ని సాధించిందో కూడా రాసుంది.
గతంలోనూ భారీ నజరానా :
గతంలోనూ టీమ్ఇండియాను ఘనంగా సన్మానించింది బీసీసీఐ. వాంఖడె స్టేడియం వేదికగా భారత జట్టు కోసం ఓ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. అందులో రూ. 125 కోట్ల నగదు బహుమతిని చెక్ రూపంలో అందజేసింది. అంతకుముందు టీమ్మెంబర్స్ అందరూ అభిమానుల నడుమ ర్యాలీగా వాంఖడె చేరుకున్నారు.
17 ఏళ్లకు
17 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ కప్ను రెండో సారి సగర్వంగా ముద్దాడింది భారత్ జట్టు. దక్షిణాఫ్రికాతో జరిగిన నరాలు తెగే ఉత్కంఠ ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి ఓటమిని అందుకుంది.
కాగా, ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఇక ఈ మ్యాచ్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, చివరి ఓవర్లో విజయం అందించిన హార్డిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అలానే బ్యాట్తో విజయంలో కీలకంగా వ్యవహరించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వరల్డ్కప్ నెగ్గడంలో బిగ్ స్ట్రాటజీ- పంత్ చాకచక్యం వల్లే అలా!: రోహిత్ - Rohit Sharma On World Cup
2024 టాప్ గూగుల్ ట్రెండ్స్- లిస్ట్లో T20 వరల్డ్ కప్ టోర్నీ- ఆ సిరీస్ కూడా