తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ ఏనుగుపై స్వామీజీ- రూ.75లక్షలకుపైగా విలువైన నాణేలతో తులాభారం- దేశంలోనే తొలిసారి! - elephant tulabharam with coins

Jumbo Tulabharam In Karnataka : కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘనంగా జంబో తులాభార కార్యక్రమం జరిగింది. ఏనుగుపై శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్దరామస్వామిని కూర్చోబెట్టి రూ.75లక్షలకుపైగా విలువున్న 10 రూపాయల నాణేలతో తులాభారం వేశారు. ఈ కార్యక్రమానికి చూసేందుకు పెద్ద ఎత్తున్న భక్తులు, ప్రజలు తరలివచ్చారు.

Jumbo Tulabharam In Karnataka
Jumbo Tulabharam In Karnataka

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 10:35 AM IST

ఘనంగా అరుదైన 'జంబో' తులాభార కార్యక్రమం

Jumbo Tulabharam In Karnataka : కర్ణాటకలో శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్ధరామస్వామి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అరుదైన జంబో తులాభార కార్యక్రమం నిర్వహించారు. మఠానికి సంబంధించిన ఏనుగుపై సిద్దరామస్వామిని కూర్చోబెట్టి 5,555 కిలోల రూ.10 నాణేలతో తులభారం వేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

సిద్ధరామస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శిరహట్టి ఫకీరేశ్వర మఠం నిర్వాహకులు ఏడాదిపాటు భవైక్యతా రథయాత్ర నిర్వహించారు. అయితే తులభారానికి ముందు హుబ్బళ్లిలోని త్రిమురు సవీర మఠం నుంచి ఐదు ఏనుగులు, ఐదు ఒంటెలు సహా వివిధ బృందాలతో ఊరేగింపు జరిగింది. ఈ మహా శోభాయాత్రలో ఫకీర సిద్ధరామ స్వామిజీ, దింగాళేశ్వర స్వామీజీ, మూడువేల మఠాల స్వామీజీలు, వంద మందికి పైగా మఠాధిపతులు పాల్గొన్నారు.

పేద విద్యార్థుల చదువు కోసం!
అనంతరం తులాభార కార్యక్రమం జరిగింది. పేద విద్యార్థుల చదువు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా స్వామిజీతో సహా ఏనుగు తులాభారం జరిగింది. ఈ తులాభారానికి రూ.22 లక్షలతో 40 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇనుప త్రాసును ఉపయోగించారు. రాయ్‌పుర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ ఈ భారీ త్రాసును తయారు చేసింది. దీని బరువు 25 టన్నులకు పైగా ఉంటుందని అంచనా.

అనేక జాగ్రత్తలతో!
ఇక తులాభారం వేసే సమయంలో అనేక జాగ్రత్తలను తీసుకున్నారు మఠం నిర్వాహకులు. మొత్తం ఐదు భారీ స్తంభాల మధ్యలో ఈ త్రాసును ఉంచారు. తులాభారం కోసం రూ.75 లక్షల 40 వేల రూపాయల విలువైన 5555 రూ.10 నాణేలను వినియోగించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు కూడా విచ్చేశారు. రాష్ట్ర మంత్రి హెచ్.కె. పాటిల్, ఈశ్వర్ ఖండ్రే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ పరిషత్ సభ్యుడు జగదీష్ షెట్టర్ తదితరులు పాల్గొన్నారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్!
''శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్ధరామస్వామి అమృత మహోత్సవంలో భాగంగా భారీ తులాభారం నిర్వహించాం. నెహ్రూ మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమ వివరాలను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు పంపనున్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. తులాభారం రోజున లక్ష మందికి ప్రసాదం ఏర్పాటు చేశాం" అని ఫకీర్‌ దింగాళేశ్వర స్వామీజీ తెలిపారు.

గుడిలో ముస్లిం ఫ్రెండ్​కు తులాభారం.. తిరుపతిలో మొక్కు తీర్చుకున్న హిందూ స్నేహితుడు

స్వామీజీకి మొక్కలతో తులాభారం.. పర్యావరణాన్ని కాపాడేందుకు వినూత్న సందేశం

ABOUT THE AUTHOR

...view details