తెలంగాణ

telangana

IRCTC దివ్యమైన తిరుమల ప్యాకేజీ - శ్రీవారి స్పెషల్​ దర్శనంతోపాటు మరెన్నో! - IRCTC Tirupati Tour

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 2:05 PM IST

IRCTC Tirupati Tour : తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఆలయాలనూ చూడాలనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. IRCTC తీసుకొచ్చిన ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్నారంటే.. కేవలం రెండు రోజుల్లోనే తిరుమలతోపాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC Vishakhapatnam to Tirumala Tour
IRCTC Tirupati Tour (ETV Bharat)

IRCTC Vishakhapatnam to Tirumala Tour Package : చాలా మందికి కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలని ఉంటుంది. సౌత్ ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతోపాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అలాంటి వారి కోసం.. కేవలం రెండ్రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఓ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. ఈ టూర్​ విమానంలో కొనసాగుతుంది. అంతేకాదు.. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలతో(Tirumala)పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. కాబట్టి.. ఒకవేళ మీరూ తిరుపతి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి.

"Tirupati Balaji Darshanam Air Package Ex. Vishakhapatnam" పేరుతో.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్‌ రెండు రాత్రులు, 3 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్​లో భాగంగా తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలనూ సందర్శించవచ్చు. మీరు ఈ ప్యాకేజీని బుకింగ్‌ చేసుకుంటే.. విమానంలో తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని తిరిగి విశాఖపట్నం చేరుకోవచ్చు.

టూర్ కొనసాగనుందిలా :

  • మొదటి రోజు ఉదయం 10:25 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి విమానం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి రీచ్ అవుతారు.
  • అక్కడి నుంచి హోటల్​కు వెళ్లి ఫ్రెషప్​, లంచ్​ తర్వాత.. శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాలను దర్శించుకుని హోటల్​కు వస్తారు. నైట్ డిన్నర్ తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ అనంతరం తిరుమల బాలాజీ దర్శనం ఉంటుంది. తర్వాత లంచ్​ చేసి శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను సందర్శించి హోటల్​కు తిరిగి వస్తారు. నైట్ డిన్నర్ తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ అయ్యాక.. హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి గోవింద రాజ స్వామి టెంపుల్​, ఇస్కాన్​ టెంపుల్​ను దర్శించుకుంటారు. లంచ్​ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటే.. తిరుపతి నుంచి విశాఖపట్నానికి విమానం బయలుదేరుతుంది. రాత్రి 6:35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోవడంతో ఈ టూర్‌ ముగుస్తుంది.

హైదరాబాద్​ To తిరుపతి - ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం - పైగా ఈ ప్రదేశాలు కూడా!

ప్యాకేజీ వివరాలు (టికెట్‌ ధర ఒక్కొక్కరికి) :

  • సింగిల్‌ షేరింగ్ రూ.24,180
  • ట్విన్‌ షేరింగ్‌ రూ.20,810
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ రూ.20,615
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.18,995; విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.18,500 చెల్లించాలి.

ఇవి గమనించాలి :

  • తిరుమల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
  • 12 ఏళ్లలోపు చిన్నారులకు లడ్డూ ప్రసాదం ఉండదనే విషయాన్ని గమనించాలి.
  • ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా.. ఫ్లైట్ టికెట్స్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ ఆలయంలో దర్శనం, శ్రీనివాస మంగాపురం కవర్ అవుతాయి.
  • యాత్రికులకు గైడ్‌ సదుపాయం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 2024, ఆగస్టు 23వ తేదీన అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్​చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి.

ఇవీ చదవండి :

IRCTC అద్భుతమైన ఆధ్యాత్మిక టూర్ - తక్కువ ధరకే ఏడు జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం!

హైద్రాబాద్​ To శ్రీలంక - రామాయణ జ్ఞాపకాలు చూసొస్తారా? - IRCTC స్పెషల్​ ప్యాకేజీ!

ABOUT THE AUTHOR

...view details