ETV Bharat / bharat

UNOలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి - పర్వతనేని హరీశ్​ను నియమించిన కేంద్రం - uno indian ambassador

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 6:14 PM IST

Indian Ambassador To United Nations : అమెరికా న్యూయార్క్​లోని ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా హరీశ్​ పర్వతనేని నియమితులయ్యారు. తెలుగు వ్యక్తి అయిన హరీశ్​.. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

uno indian ambassador
uno indian ambassador (ETV Bharat)

Indian Ambassador To United Nations : ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి హరీశ్​ పర్వతనేని నియమితులయ్యారు. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను.. న్యూయార్క్​లోని UNOలో అంబాసిడర్​గా నియమించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పింది.

హరీశ్​ పర్వతనేని 1990 బ్యాచ్​కు చెందిన ఐఎఫ్​ఎస్​ అధికారి. 2021 నవంబర్​ నుంచి జర్మనీలో భారత రాయబారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) గానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో భారత్​.. అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకునేలా కృషి చేశారు. వీటితో పాటు జీ20, జీ 7, బ్రిక్స్​, IBSA లాంటి కూటముల్లోని ఆర్థిక వ్యవహారాలకు నేతృత్వం వహించారు.

గాజా సహా అనేక మిషన్లలో భాగం
సియారో, రియాద్​ సహా భారత్ చేపట్టిన అనేక మిషన్లలో ఆయన పనిచేశారు. ఇజ్రాయెల్​తో యుద్ధం జరుగుతున్న పాలస్తీనాలోని గాజా సిటీకి భారత ప్రతినిధిగా వెళ్లారు. అక్కడ ఐక్యరాజ్య సమితి మానవతా సాయం కార్యక్రమంలో పాలసీ అనాలిసిస్​ యూనిట్​ చీఫ్​గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా, విదేశాంగ ప్రచార విభాగాల్లోనూ పనిచేశారు. 2007 నుంచి ఐదేళ్ల పాటు భారత ఉపరాష్ట్రపతి వద్ద ఓఎస్​డీగా ఉన్నారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు అమెరికాలోని హౌస్టన్​లో 8 రాష్ట్రాలకు సంబంధించిన కౌన్సిల్​ జనరల్ ఆఫ్​ ఇండియాగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు వియత్నాం రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు.

ఉస్మానియాలోనే ఇంజినీరింగ్​- గోల్డ్ మెడల్​ సొంతం
తెలంగాణ హైదరాబాద్​కు చెందిన హరీశ్​.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్​ ఇంజినీరింగ్ చదివారు. గోల్డ్​ మెడల్ కూడా సంపాదించారు. ఆ తర్వాత బంగాల్​ కోలకతాలోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మేనేజ్​మెంట్​లోనూ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1990లో ఇండియన్​ ఫారిన్ సర్వీస్​కు ఎంపికయ్యారు. ఈయన అరబిక్ భాష కూడా మాట్లాడగలరు.

పంద్రాగస్టు వేడుకలకు అంతా రెడీ- 11వ సారి జెండా ఎగరేయనున్న మోదీ- 6వేల మందికి ఆహ్వానం - Independence Day 2024

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు - పెరగనున్న మహిళలు - తగ్గనున్న యువత - INDIA POPULATION 2036

Indian Ambassador To United Nations : ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి హరీశ్​ పర్వతనేని నియమితులయ్యారు. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను.. న్యూయార్క్​లోని UNOలో అంబాసిడర్​గా నియమించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో చెప్పింది.

హరీశ్​ పర్వతనేని 1990 బ్యాచ్​కు చెందిన ఐఎఫ్​ఎస్​ అధికారి. 2021 నవంబర్​ నుంచి జర్మనీలో భారత రాయబారిగా పని చేస్తున్నారు. అంతకు ముందు విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (ఆర్థిక వ్యవహారాలు) గానూ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో భారత్​.. అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను చేసుకునేలా కృషి చేశారు. వీటితో పాటు జీ20, జీ 7, బ్రిక్స్​, IBSA లాంటి కూటముల్లోని ఆర్థిక వ్యవహారాలకు నేతృత్వం వహించారు.

గాజా సహా అనేక మిషన్లలో భాగం
సియారో, రియాద్​ సహా భారత్ చేపట్టిన అనేక మిషన్లలో ఆయన పనిచేశారు. ఇజ్రాయెల్​తో యుద్ధం జరుగుతున్న పాలస్తీనాలోని గాజా సిటీకి భారత ప్రతినిధిగా వెళ్లారు. అక్కడ ఐక్యరాజ్య సమితి మానవతా సాయం కార్యక్రమంలో పాలసీ అనాలిసిస్​ యూనిట్​ చీఫ్​గాను బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా, విదేశాంగ ప్రచార విభాగాల్లోనూ పనిచేశారు. 2007 నుంచి ఐదేళ్ల పాటు భారత ఉపరాష్ట్రపతి వద్ద ఓఎస్​డీగా ఉన్నారు. అనంతరం 2012 నుంచి 2016 వరకు అమెరికాలోని హౌస్టన్​లో 8 రాష్ట్రాలకు సంబంధించిన కౌన్సిల్​ జనరల్ ఆఫ్​ ఇండియాగా పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు వియత్నాం రాయబారిగా బాధ్యతలు నిర్వహించారు.

ఉస్మానియాలోనే ఇంజినీరింగ్​- గోల్డ్ మెడల్​ సొంతం
తెలంగాణ హైదరాబాద్​కు చెందిన హరీశ్​.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్​ ఇంజినీరింగ్ చదివారు. గోల్డ్​ మెడల్ కూడా సంపాదించారు. ఆ తర్వాత బంగాల్​ కోలకతాలోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మేనేజ్​మెంట్​లోనూ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత 1990లో ఇండియన్​ ఫారిన్ సర్వీస్​కు ఎంపికయ్యారు. ఈయన అరబిక్ భాష కూడా మాట్లాడగలరు.

పంద్రాగస్టు వేడుకలకు అంతా రెడీ- 11వ సారి జెండా ఎగరేయనున్న మోదీ- 6వేల మందికి ఆహ్వానం - Independence Day 2024

2036 నాటికి భారత జనాభా 152 కోట్లు - పెరగనున్న మహిళలు - తగ్గనున్న యువత - INDIA POPULATION 2036

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.