తెలంగాణ

telangana

'ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు? ఎవరికి ఏ శాఖ?'- దిల్లీలో బీజేపీ నేతల కసరత్తు - BJP Meeting At Delhi

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 12:11 PM IST

Updated : Jun 6, 2024, 1:29 PM IST

BJP Leaders Meeting : కేంద్రంలో మూడోసారి ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న వేళ బీజేపీ అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌, పార్టీ అ‌గ్రనేతలు చర్చించారు.

BJP leaders meeting
BJP leaders meeting (ANI)

BJP Leaders Meeting :కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్​డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇక మోదీ కేబినెట్​ మంత్రులు ఎవరనే అంశంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బీజేపీ అగ్రనేతలు దిల్లీలో సమావేశమయ్యారు.

గురువారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు, ఆర్​ఎస్​ఎస్​ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో సమన్వయంపై చర్చించారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కసరత్తు జరిగింది. ఈ సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, బీఎల్ సంతోష్, సురేష్ సోని, అరుణ్‌కుమార్‌, దత్తాత్రేయ హొసబెళె తదితరులు పాల్గొన్నారు. ఇక కొత్తగా ఎన్నికైన ఎన్​డీఏ ఎంపీలంతా శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్​లో సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే నరేంద్ర మోదీని తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకునే అవకాశముంది. అలాగే బీజేపీ పార్లమెంటరీ సమావేశం కూడా శుక్రవారమే జరగనుంది.

మోదీ కేబినెట్​లో టీడీపీ, జేడీయూ!
ఇక ఎన్​డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలకు కేబినెట్​లో ప్రాధాన్యం లభించే అవకాశాలున్నట్లు సమాచారం. కేబినెట్​లో టీడీపీ 5, జేడీయూ 2, జేడీస్ 1 ఇలా మంత్రి పదువులను డిమాండ్లు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీకి లోక్​సభ స్పీకర్, ఆర్థిక మంత్రిత్వ శాఖపై దృష్టి పెట్టినట్లు, జేడీయూ రైల్వే మంత్రిత్వ శాఖ, జేడీఎస్​ వ్యవసాయ శాఖను డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఎన్నికల ఫలితాలపై ఎన్​సీపీ భేటీ
మరోవైపు లోక్​సభ ఎన్నికల్లో ఎన్​సీపీ పనితీరును సమీక్షించేందుకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు. గురువారం ముంబయిలోని అధికారిక నివాసంలో ఈ భేటీని నిర్వహించారు. లోక్​సభ ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరుపై చర్చించారు. ఈ సమావేశానికి అజిత్​ పవార్​తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నేతలు, మంత్రులు హాజరయ్యారు.

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం- మిత్ర దేశాల అగ్ర నేతలకు ఆహ్వానం

ఎంపీగా గెలుపు- జైలులో ఉన్నా లోక్​సభకు వెళ్లొచ్చా?- చట్టం ఏం చెబుతోందంటే? - Lok Sabha Election Results 2024

Last Updated : Jun 6, 2024, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details