thumbnail

Prathidhwani పార్టీల ఫిరాయింపులపై రాజ్యాంగ ధర్మాసనం ముందున్న ప్రశ్నలేంటీ

By

Published : Aug 24, 2022, 9:34 PM IST

Prathidhwani దేశంలో ఇటీవల కాలంలో పెరిగిన పార్టీ ఫిరాయింపులతో ప్రజస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. చట్టసభల ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులు అధికారం కోసం ఇంకోపార్టీలోకి ఫిరాయించడం సర్వ సాధారణమైపోయింది. ప్రభుత్వంలో పదవుల కోసం నాయకులు పార్టీలు మారుతున్నారు. లేదంటే పార్టీనే చీల్చి అధికారంలో కూర్చుంటున్నారు. రాజకీయం ఒక జూదంగా మారిన ప్రస్తుత తరుణంలో... ఎన్నికల్లో నేతలకు ఓట్లేయడం ద్వారా ప్రజలిచ్చిన తీర్పు ప్రశ్నార్థకం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే రెండుగా చీలింది మహారాష్ట్రలో శివసేన పార్టీ. అధికారం కోసం శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందుకు చేరింది. ఈ నేపథ్యంలో అసలు దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు ఎలా ఉంది? దానిలో లోపాలను సవరించి, చట్టాన్ని మరింతగా బలోపేతం చేసే అవకాశాలున్నాయా... అనే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.