'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం' - water man
🎬 Watch Now: Feature Video

రెండు మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ నీటి కష్టాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. వేసవిలో బిందెడు నీటి కోసం ప్రజలు నిద్రాహారాలు మానాల్సి వచ్చింది. నిన్నటికి నిన్న శ్రీకాకుళం జిల్లాలో నీటికోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ వ్యక్తి మరణించారు. ఇప్పటికీ వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లాల్లో వందల ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే జలసంరక్షణే మార్గమంటున్నరాజేంద్రసింగ్తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ...