రూ.20వేల అప్పు కోసం 40 అడుగుల చెట్టెక్కిన యువకుడు.. 9గంటల తర్వాత ఏమైందంటే?

By

Published : Apr 16, 2023, 10:04 PM IST

Updated : Apr 16, 2023, 10:55 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లోని జాంజ్​గిర్​- చంపా జిల్లాలో ఓ యువకుడు హల్​ చల్​ చేశాడు. అప్పుల బాధతో సూసైడ్​ చేసుకుందామనే ఆలోచనతో ఏకంగా 40 అడుగుల ఎత్తైన రావి చెట్టు మీదకు ఎక్కాడు. చెట్టుపై ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు అక్కడకు చేరుకొని గుమిగూడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి ఎస్​డీఆర్​ఎఫ్​ బృందంతో చేరుకున్నారు బలోడా పోలీసులు. 9 గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్​​ ఎట్టకేలకు పొడవైన నిచ్చెన సాయంతో అతడిని సురక్షితంగా కిందకు దించింది. 

జిల్లాలోని మదన్‌పుర్‌ గ్రామానికి చెందిన రామ్‌ గోపాల్‌ యాదవ్‌ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైనాపుర్​ గ్రామంలోని ఓ ఎత్తైన రావి చెట్టును ఎక్కి గట్టిగా అరిచినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయం తీసుకున్నానని రామ్​ చెప్పాడు. చెట్టుపై నుంచి కిందకు దింపిన రామ్​ గోపాల్​ యాదవ్​కు కౌన్సెలింగ్​ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే చెట్టుపైకి ఎక్కిన యువకుడికి 7 గంటల తర్వాత తినడానికి సమోసా, నీళ్లను అందించారు అధికారులు. అయితే రామ్​ గోపాల్​ యాదవ్​, అతడి భార్య అనితా యాదవ్​ గత 5 సంవత్సరాలుగా ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఇటుక బట్టీలో కార్మీకులుగా పనిచేస్తున్నారు. అయితే తన భర్త మానసిక పరిస్థితి బాగాలేదని రామ్​ భార్య తెలిపింది.

Last Updated : Apr 16, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.