'సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే' - ఎన్బీటి నగర్ బండ మైసమ్మ నగర్ లో ప్రచారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-11-2023/640-480-19940821-thumbnail-16x9-talasani.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 4, 2023, 5:24 PM IST
Talasani Srinivas Yadav Election Campaign : గతంలో ఉన్న నాయకులు సనత్నగర్లో అభివృద్ధి ఏమీ చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని ఎన్బీటి నగర్, బండమైసమ్మ నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. సికింద్రాబాద్లో సనత్నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగాా అభివృద్ధి చేశానని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండటమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం తాను నిత్యం పాటుపడుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే సనత్నగర్ చాలా అభివృద్ధి చెందిందన్నారు.
Talasani on Sanathnagar Development : సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తన హయాంలో సనత్నగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. మిగతా పార్టీలు అధికారం కోసమే పోటీ చేస్తున్నాయని విమర్శించారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.