ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి : సీతక్క - ములుగు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video


Published : Nov 28, 2023, 1:09 PM IST
Seethakka Election Campaign In Mulugu 2023 : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క విమర్శించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. అధికారంలోకి రాగానే అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజా పాలన రావeలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ప్రచారానికి వచ్చిన సీతక్కకు.. గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
Seethakka Comments On KCR : పదేళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ ధర రూ.400 గా ఉండేదని.. ఇప్పుడు రూ.1200కు పెంచారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఉచితంగా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ ఫాం హౌస్లకు ఉచిత కరెంట్, పేద ప్రజలకు ఇళ్లకు వేలకు వేలు బిల్లు వేసి, వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బస్సులో పేదవారు ప్రయాణం చేస్తారని.. కానీ వారి నుంచ ఆర్టీసీ ప్రయాణ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలని సీతక్క పేర్కొన్నారు.