ప్రజావాణికి విశేష స్పందన - తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 12:24 PM IST

thumbnail

Prajavani Program Telangana  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనుహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్​కు(Praja bhavan) ప్రజలు తెల్లవారుజామునే పోటెత్తారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు ‌అందజేశారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన దివ్యాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

Huge Crowd at Prajabhavan for Prajavani : రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. రెండు పడక గదులు, భూ సమస్యలు, ఫింఛన్లు రావడం లేదని కొంతమంది ప్రభుత్వాన్ని వేడుకుంటూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరై స్వయంగా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి బాధిత ప్రజలకు భరోసా ఇస్తున్నారు. పెద్ద ఎత్తున అర్జీదారులు తరలిరావడంతో ప్రజాభవన్‌ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 

Mid Day Meals Workers Protest At Praja Bhavan : మరోవైపు ప్రజా భవన్ వద్ద పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. ప్రతి నెల 10వ తేదీలోగా మెస్ బిల్లులు, జీతాలు చెల్లించాలని నినాదాలు చేశారు. పెంచిన మూడు వేల జీతాన్ని వెంటనే చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు నిరసనకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.