MLA Raja Singh Comments on Fake Votes : 'బీఆర్​ఎస్​-ఎంఐఎం కలిసి బోగస్​ ఓట్లు సృష్టిస్తున్నాయి'

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 3:50 PM IST

thumbnail

MLA Raja Singh Interesting Comments on Fake Votes in Telangana : రాష్ట్రంలోని ఓట్ల విషయంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​- ఎంఐఎం కలిసి బోగస్​ ఓట్లు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఒక్కో నియోజక వర్గంలో 70 వేల బోగస్​ ఓట్లకు కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఒక సెగ్మంట్​ ఓట్లు మరో సెగ్మెంట్​లోకి వెళ్తున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో తెలంగాణలో ఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక - మహారాష్ట్ర వ్యక్తుల ఓట్లు రాష్ట్రంలో నమోదవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్​కి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా దొంగ ఓట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ సెగ్మెంట్​లో ఓట్లు తగ్గుతున్నాయని.. మిగతా సెగ్మెంట్లలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

MLA Raja Singh Fire on KTR : రజాకార్ సినిమా టీజర్​(Razakar Movie Teaser)కు భయపడి నిజాం వారసులు ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ట్విటర్ మెన్​ కేటీఆర్ సెన్సార్ బోర్డ్​కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్​ తనకి చెప్పలేదా అని కేటిఆర్​ని ప్రశ్నించారు. మూవీ చూసిన తర్వాత సినిమాపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రజాకార్ సినిమా కలిసి చూద్దామని మంత్రి కేటీఆర్​ను రాజాసింగ్​ ఆహ్వానించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.