Minister Jagadeesh Reddy Fires on Congress : కాంగ్రెస్ను నమ్మితే మరోసారి రైతులకు చిమ్మచీకట్లే : జగదీశ్ రెడ్డి - తెలంగాణ రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-10-2023/640-480-19832923-thumbnail-16x9-jagadeesh-reddy-fires-congress.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 22, 2023, 5:38 PM IST
Minister Jagadeesh Reddy Fires on Congress : సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్కు ఓటు వేసే ముందు రైతులు, ప్రజలు ఆలోచించాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో రైతులు కరెంటు లేక గగ్గోలు పెడుతున్నారని.. అలాంటి కాంగ్రెస్ను నమ్మితే మరోసారి రైతులు చిమ్మచీకట్లను చూడాల్సి వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి విమర్శించారు. కర్ణాటకలో అవకాశమిస్తే.. కనీసం రైతులను పట్టించుకునే నాథుడేలేరన్నారు. పాముల బాధే కాదు.. మొసళ్ల బాధ కూడా ఉందంటూ సబ్ స్టేషన్లలో మొసళ్లను వదిలి నిరసన తెలుపుతున్నారన్నారు.
తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోయే పరిస్థితి లేదని.. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మితే 2014 కు ముందు పరిస్థితులు మళ్లీ వస్తాయని ప్రజలు గమనించాలని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ను నమ్మితే రాష్ట్రం నట్టేటా మునుగుతుందన్నారు. విద్యుత్ సరఫరాపై జానారెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారన్నారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నపుడు నాగార్జున సాగర్లో రాత్రిపూట కరెంటు ఉండేదా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.