అక్రమంగా మద్యం తరలింపు - 384 లిక్కర్ బాటిల్స్ సీజ్

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 12:02 PM IST

thumbnail

Illegal Liquor Transport in Telangana 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రభావం దృష్ఠ్యా మద్యం ఎరులై పారుతోంది. పోలీసుల విస్తృత తనిఖీల్లో పలుచోట్ల మద్యం పట్టుబడుతోంది. తాజాగా నిజామాబాద్​లో 384 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని ఎల్లారెడ్డి ఎక్సైజ్​ అధికారులు పట్టుకున్నారు. గాంధారి నుంచి చద్మల్ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా టాటా మ్యాజిక్‌ ఆటోలో ఎనిమిది మద్యం పెట్టెలను గుర్తించారు. 

Illegal Liquor Seized in Nizamabad : మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. వాహనంలో ఉన్న వ్యక్తి నేరెలు తండాకు చెందిన రమేశ్​గా గుర్తించారు. రమేశ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి ఠాణాకు తరలించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం, వాహనం విలువ సుమారు రూ. 4 లక్షల 75 వేల ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం భారీగా పట్టుబడుతోంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.