నిజామాబాద్ జిల్లాలో సీఎం కాన్వాయ్ను తనిఖీ చేసిన ఎన్నికల బృందం - సబితా కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-11-2023/640-480-19926021-thumbnail-16x9-cm-kcr.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 2, 2023, 8:14 PM IST
Election Team Inspects CM KCR Convoy in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగదు, మద్యం, కానుకల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. నేతల నుంచి మంత్రుల వరకు అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. తాజాగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కాన్వాయ్ను ఎన్నికల బృందం తనిఖీ చేసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సీఎం కాన్వాయ్ను స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందం తనిఖీలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా వెళ్తున్న కాన్వాయ్ను ఇందల్వాయి టోల్ ప్లాజ్ వద్ద కేంద్ర బలగాలతో కూడిన బృందం తనిఖీలు చేసింది.
Police Inspects Minister Sabitha Convoy : మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్ వాహన శ్రేణిని పోలీసులు నిలిపివేశారు. కాన్వాయ్లోని అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి సోదా చేశారు. వాహనం దిగిన మంత్రి సబిత.. పోలీసులకు సహకరించారు. పోలీసులు మంత్రి పర్సును కూడా తనిఖీ చేశారు.