Chain Snatching in Bodhan : అలా వచ్చి.. ఇలా దోచుకున్నారు.. తేరుకునేలోపే పరారయ్యారు

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 7:44 PM IST

thumbnail

Chain Snatching in Bodhan : గుడికి వెళ్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దొంగలు హల్​చల్​ చేశారు. బోధన్ నర్సీ రోడ్డులోని మర్రి మైసమ్మ ఆలయ సేవకురాలు లక్ష్మి.. రోజూలాగే ఆలయానికి వెళ్తుండగా.. ఎవరూ లేని సమయం చూసి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆమెను కొట్టి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును కాజేశారు. వెంటనే బండిపై పారిపోయారు. వారు వేగంగా వెళ్లిపోవడం, చుట్టూ ఎవరూ లేకపోవడంతో బాధితురాలు నిస్సహాయురాలైంది. దోపిడీకి పాల్పడి పరారవుతున్న ముగ్గురు చైన్ స్నాచర్ల ఆనవాళ్లు సాలూర క్యాంప్ వద్దనున్న సీసీటీవీ పుటేజ్​లో రికార్డయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. చైన్ స్నాచర్ల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ ఘాతుకంతో స్థానిక ప్రజలంతా భయాందోళ చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.