'ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన సమయం వచ్చింది'

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 7:20 PM IST

thumbnail

BJP MP Laxman Election Campaign : తెలంగాణ వచ్చింది కొలువుల కోసం, హక్కులు ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉందని ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్​ల్లోని వివేక్ నగర్​, పార్దివాడ, కాపువాడ బస్తీ, నగర కేంద్ర గ్రంథాలయం, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో.. ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజుకు మద్దతుగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం చేస్తూ బీజేపీ మేనిఫెస్టోను వివరించారు.

తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన పోరాటం ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఈ ప్రభుత్వం మంట కలిపిందని కె.లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, రైల్వే తదితర ప్రభుత్వ రంగాల్లో అనేక ఖాళీలను భర్తీ చేసిందని వివరించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు గురవుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే అభ్యర్థి పూస రాజుకు విన్నవించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.