thumbnail

By

Published : Jul 3, 2023, 4:38 PM IST

Updated : Jul 3, 2023, 6:51 PM IST

ETV Bharat / Videos

Raja Singh on Uniform Civil Code : 'ఉమ్మడి పౌరస్మృతిని ఎవరూ ఆపలేరు'

Raja Singh Comments on Uniform Civil Code : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి త్వరలో కచ్చితంగా అమలు కాబోతుందని, దానిని ఎవరూ ఆపలేరని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, పవన్ కల్యాణ్​ను చంపాలన్న వారిని ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్​లో కొందరు యూనిఫామ్ సివిల్​ కోడ్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని.. లేని పక్షంలో దీనిని ప్రతిపాదించిన వారిని హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

అలా బెదిరింపులకు పాల్పడుతున్న నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను కాదు కాదా.. ఆంధ్రప్రదేశ్​లోని ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా ముట్టుకోలేరన్నారు. ఒకవేళ ముట్టుకున్నా తర్వాత పర్యవసానాలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. ఆ కార్యకర్తలే మీకు సరైన బుద్ధి చెబుతారని రాజాసింగ్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని మతాల వారికి ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఉపయోగపడుతుందని.. కొందరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే భారత్​ హిందూ రాష్ట్రంగా అవతరించనుందని తెలిపారు.

Last Updated : Jul 3, 2023, 6:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.