thumbnail

నగరంలో సినీ నటి రాశీఖన్నా సందడి..

By

Published : Apr 8, 2023, 5:45 PM IST

Actress Raashi Khanna in Hyderabad : హైదరాబాద్​ కూకట్‌పల్లిలో సినీ నటి రాశీఖన్నా సందడి చేశారు. కేపీహెచ్​బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బంగారు నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. స్టోర్​లో కలియ తిరుగుతూ పలు ఆభరణాలను ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. రాశీఖన్నాను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. రాశీ ఖన్నా రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజీపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు రాశీఖన్నా.

ఈ సందర్భంగా తనకు నగలు అంటే చాలా ఇష్టమని రాశీ ఖన్నా తెలిపారు. ఈ స్టోర్​లో మగువలను కట్టిపడేసే అద్భుతమైన బంగారు ఆభరణాల కలెక్షన్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో నేడు మూడో స్టోర్​ను ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని.. సంస్థ ఛైర్మన్ బిందు మాధవ్​ అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో కూడా  ప్రారంభించనున్నట్లు చెప్పారు. అద్భుతమైన డిజైన్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. వినియోగదారులు తమ దుకాణాన్ని సందర్శించి ఆదరించాలని బిందు మాధవ్ కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.