thumbnail

'భాజపా కార్యకర్తలైనందుకే చెట్లకు కట్టేసి కొట్టారు'

By

Published : Jun 5, 2021, 2:45 PM IST

బంగాల్​లో మరో హింసాత్మక ఘటన వెలుగు చూసింది. దినాజ్​పుర్​ జిల్లాలోని రాయ్​గంజ్​లో కొందరు యువకులను చెట్లకు కట్టేసి చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్​ నేతలే అని, భాజపా కార్యకర్తలుగా ఉన్నందుకే దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత టీఎంసీ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోందని, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగంపైనా తమకు అనుమానం కలుగుతోందని భాజపా పేర్కొంది. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. పొలం నుంచి ఆవులను తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని, భాజపా కార్యకర్తలు అయినందునే కొట్టారనడం పచ్చి అబద్ధం అని తెలిపింది. దీనిని భాజపా కుట్రగా అభివర్ణించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.