ఔరా: మట్టి కుండపై నిల్చొని కళ్లు చెదిరేలా కర్రసాము!
తమిళనాడు విరుతునగర్, శ్రీవిల్లిపుతుర్కు చెందిన ఓ యువతి తమిళ ప్రాచీన యుద్ధ కళ 'సిలంబం'తో అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాలపాటు మట్టి కుండపై నిలబడి రెండు కర్రలను చకచకా తిప్పేసింది. నేతాజీ సిలంబం అకాడమీలో శిక్షణ పొందిన ఆమె ఎస్ఐఎస్ఏ స్పోర్ట్ అకాడమీ నిర్వహించిన ఆన్లైన్ పోటీల్లో కర్రసాము ఇలా ప్రదర్శించింది.