ఎటు చూసినా వరద.. మధ్యలో బస్సు.. ఏమైందంటే? - reckless driving
🎬 Watch Now: Feature Video

ఎటు చూసినా ఉప్పొంగుతున్న వరద.. మధ్యలో బస్సు.. భయాందోళనలో ప్రయాణికులు.. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యం మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా మహదా మండలంలో జరిగింది. ఓ బస్సు డ్రైవర్.. ఉప్పొంగే వరదలోంచే బస్సును వంతెన దాటించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. డ్రైవర్ తీరుపై మండిపడ్డ ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.