Viral: చేపలు దొంగతనం చేశారని చెట్టుకు కట్టేసి..

By

Published : Jun 21, 2021, 10:01 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​, బల్​రామ్​పుర్​- రామానుజ్​ గంజ్ జిల్లాలోని చెరా గ్రామ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. చెరువులో చేపల దొంగతనం చేశారని ఆరోపిస్తూ పాండో గిరిజన తెగకు చెందిన 8 మందిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన జూన్​ 15న జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సర్పంచ్​తో సహా గ్రామ పెద్దలు కలిసి గ్రామ పంచాయతీలోనే తీర్పు ఇచ్చి శిక్షను అమలు చేశారు. దండనతోపాటు ఒక్కొక్కరికి రూ.35 వేల జరిమానాను విధించారు. ఈ అఘాయిత్యాన్ని చూస్తున్న గ్రామస్థులెవరూ నోరు మెదపలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.