భార్య కోసం సెల్​టవర్​ ఎక్కిన భర్త

By

Published : Jan 27, 2021, 12:30 PM IST

thumbnail
కర్ణాటకలో ఓ వ్యక్తి టవర్​ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనను వదిలేసి వెళ్లిపోయిన భార్యను తిరిగి కాపురానికి రప్పించాలని డిమాండ్​ చేశాడు గౌరీశంకర్​. స్థానికులు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా ఇంకాస్త పైకెక్కసాగాడు. మైసూర్​లోని విద్యారణ్యపురంలో చోటుచేసుకున్న ఈ హైడ్రామాలో పోలీసులు రంగంలోకి దిగారు. సుమారు గంటన్నరపాటు శ్రమించారు. భార్య కాపురానికి వచ్చేలా సాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పటంతో.. ఎట్టకేలకు కిందకు దిగొచ్చాడు గౌరీశంకర్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.