ETV Bharat / sukhibhava

ఎక్కువ టైం టీవీ, ఫోన్​ చూస్తున్నారా?.. తస్మాత్​ జాగ్రత్త.. లేకుంటే కష్టమే!

author img

By

Published : Mar 1, 2023, 8:42 AM IST

ఏదో సరదా కోసం కాసేపు మొబైల్​, టీవీలు చూడడం తప్పేమి కాదు. కానీ, అదే పనిగా గంటల తరబడి వీటికి అంకితమవుతే మాత్రం భవిష్యత్​లో మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే తిండి, నిద్రలు మానేసి మరీ టీవీ, సెల్​ఫోన్లు, కంప్యూటర్ లేదా ల్యాప్​టాప్​లు చూసేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తద్వారా కోరిమరీ అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నారు కొందరు. ఈ ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​ చూడటానికి ఓ నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి అంటున్నారు వైద్య నిపుణులు. మరి ఎక్కువ సమయం స్క్రీన్​ను చూస్తే కంటి సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని వేధిస్తాయన్న విషయం మీకు తెలుసా?

Side Effects Of Seeing Electronic Screens
ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్​ స్క్రీన్​లు చూస్తే కలిగే నష్టాలు

మనలో చాలామందికి ఆనందం కోసం టీవీ చూడటం లేదంటే ఫోన్ చూడటం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ అలవాటు శ్రుతిమించి వ్యసనంగా మారితే ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్​టాప్ వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూస్తే కంటి సమస్యలు మాత్రమే తలెత్తుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అనేక మానసిక, శారీరక సమస్యలకు ఇది కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

టైం పాస్​ కోసం టీవీ, ఫోన్ చూసే పరిస్థితి నుంచి ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు చూడటానికే మనం కేటాయించే పరిస్థితికి వచ్చేశాం. గతంలో టీవీ లేదంటే ఫోన్​ని చూడటానికి ఒక టైం అంటూ పెట్టుకునే మనం.. ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా స్క్రీన్లను చూస్తున్నాం. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్​లు వాడే వారిలో స్క్రీన్లు చూసే సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. వర్క్ ఫ్రం హోం చేసే వారికి స్క్రీన్ చూడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడగా.. ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ల ముందు వాళ్లు గంటల కొద్దీ గడపాల్సి వస్తుంది. ఇక టీవీలో వివిధ కార్యక్రమాలను, ఫోన్లలో ఫొటోలు, వీడియోలను చూసే వారు తాము ఎంతసేపు చూస్తున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. దీని కారణంగా స్క్రీన్ టైం ఎంత అనే అంచనా ఎవరికీ ఉండటం లేదు.

స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే కేవలం కళ్లు మాత్రమే కాదు, అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, దీర్ఘకాలంలో అవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్​ల ముందు గంటల కొద్దీ గడిపే వారికి ఏదైనా తినాలనే కోరిక ఉంటుందట. దీంతో వీరు చిరుతిళ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. లేదంటే మామూలు ఆహారం తింటే స్క్రీన్లు చూస్తూ ఎక్కువ మోతాదులో లాగించేస్తారట. ఇలా శారీరక శ్రమ లేకపోగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించడం వల్ల కొవ్వు పెరిగి అధిక బరువుకు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.

ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్​ స్క్రీన్​లు చూస్తే కలిగే నష్టాలు ఇవే..

"చాలామందికి స్క్రీన్ టైం అనే దాని గురించి అవగాహన లేకపోవచ్చు. అయితే రెండు గంటల కన్నా ఎక్కువ సమయం ఒకేచోట కూర్చొని స్క్రీన్ చూడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి తోడు స్క్రీన్ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ వంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అంది, అధిక బరువు పెరిగేందుకు దారి తీస్తాయి. అలాగే ఎక్కువ స్క్రీన్ టైం ఉండే వారిలో ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి వాళ్లు అందరితో కలిసి కాసేపు మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. దీని వల్ల మానసిక సమస్యలు రావు. ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే నిద్రకు భంగం కలుగుతుంది. టీవీ చూసిన తర్వాత మంచిగా నిద్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం అది నిజం కాదు. నిద్రపోవడానికి రెండు గంటల ముందు స్క్రీన్ చూడకుండా ఉండటం మంచిది. తలనొప్పి, బీపీ పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి స్క్రీన్ టైంను తగ్గించుకోవడం మంచిది"

-డా. కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, డయాబెటలాజిస్ట్

గంటల కొద్దీ కంప్యూటర్లు లేదంటే ల్యాప్ టాప్​ల ముందు పని చేసే అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం, ప్రతి గంటకు ఒకసారి వాకింగ్ చేయడం మంచిది. స్క్రీన్ టైం ఎక్కువగా కలిగిన వాళ్లు రాత్రి సరైన సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం మంచిది. రాత్రిపూట త్వరగా పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. ఇక స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్లు తిన్నగా కూర్చోవడం ఎంతమాత్రం మంచిదికాదు. మెడ మీద ఎక్కువ ఒత్తిడి కలగకుండా జాగ్రత్తవహించాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్​టాప్ చూడటం వల్ల భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.

మనలో చాలామందికి ఆనందం కోసం టీవీ చూడటం లేదంటే ఫోన్ చూడటం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ అలవాటు శ్రుతిమించి వ్యసనంగా మారితే ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్​టాప్ వంటి ఎలక్ట్రానిక్ స్క్రీన్లను ఎక్కువ సేపు చూస్తే కంటి సమస్యలు మాత్రమే తలెత్తుతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అనేక మానసిక, శారీరక సమస్యలకు ఇది కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

టైం పాస్​ కోసం టీవీ, ఫోన్ చూసే పరిస్థితి నుంచి ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు చూడటానికే మనం కేటాయించే పరిస్థితికి వచ్చేశాం. గతంలో టీవీ లేదంటే ఫోన్​ని చూడటానికి ఒక టైం అంటూ పెట్టుకునే మనం.. ఇప్పుడు ఎలాంటి నియంత్రణ లేకుండా స్క్రీన్లను చూస్తున్నాం. టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్​లు వాడే వారిలో స్క్రీన్లు చూసే సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. వర్క్ ఫ్రం హోం చేసే వారికి స్క్రీన్ చూడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడగా.. ల్యాప్ టాప్ లేదంటే కంప్యూటర్ల ముందు వాళ్లు గంటల కొద్దీ గడపాల్సి వస్తుంది. ఇక టీవీలో వివిధ కార్యక్రమాలను, ఫోన్లలో ఫొటోలు, వీడియోలను చూసే వారు తాము ఎంతసేపు చూస్తున్నామనే విషయాన్ని మర్చిపోతుంటారు. దీని కారణంగా స్క్రీన్ టైం ఎంత అనే అంచనా ఎవరికీ ఉండటం లేదు.

స్క్రీన్ టైం ఎక్కువగా ఉంటే కేవలం కళ్లు మాత్రమే కాదు, అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయని, దీర్ఘకాలంలో అవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్​ల ముందు గంటల కొద్దీ గడిపే వారికి ఏదైనా తినాలనే కోరిక ఉంటుందట. దీంతో వీరు చిరుతిళ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. లేదంటే మామూలు ఆహారం తింటే స్క్రీన్లు చూస్తూ ఎక్కువ మోతాదులో లాగించేస్తారట. ఇలా శారీరక శ్రమ లేకపోగా ఎక్కువ క్యాలరీలను శరీరానికి అందించడం వల్ల కొవ్వు పెరిగి అధిక బరువుకు దారి తీస్తుందని వైద్యులు అంటున్నారు.

ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్​ స్క్రీన్​లు చూస్తే కలిగే నష్టాలు ఇవే..

"చాలామందికి స్క్రీన్ టైం అనే దాని గురించి అవగాహన లేకపోవచ్చు. అయితే రెండు గంటల కన్నా ఎక్కువ సమయం ఒకేచోట కూర్చొని స్క్రీన్ చూడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి తోడు స్క్రీన్ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ వంటి స్నాక్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అంది, అధిక బరువు పెరిగేందుకు దారి తీస్తాయి. అలాగే ఎక్కువ స్క్రీన్ టైం ఉండే వారిలో ఒంటరితనం వేధిస్తుంది. అలాంటి వాళ్లు అందరితో కలిసి కాసేపు మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మంచిది. దీని వల్ల మానసిక సమస్యలు రావు. ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే నిద్రకు భంగం కలుగుతుంది. టీవీ చూసిన తర్వాత మంచిగా నిద్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం అది నిజం కాదు. నిద్రపోవడానికి రెండు గంటల ముందు స్క్రీన్ చూడకుండా ఉండటం మంచిది. తలనొప్పి, బీపీ పెరుగుదల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి స్క్రీన్ టైంను తగ్గించుకోవడం మంచిది"

-డా. కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, డయాబెటలాజిస్ట్

గంటల కొద్దీ కంప్యూటర్లు లేదంటే ల్యాప్ టాప్​ల ముందు పని చేసే అవసరం ఉన్న వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగడం, ప్రతి గంటకు ఒకసారి వాకింగ్ చేయడం మంచిది. స్క్రీన్ టైం ఎక్కువగా కలిగిన వాళ్లు రాత్రి సరైన సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవడం మంచిది. రాత్రిపూట త్వరగా పడుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టినట్లవుతుంది. ఇక స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్లు తిన్నగా కూర్చోవడం ఎంతమాత్రం మంచిదికాదు. మెడ మీద ఎక్కువ ఒత్తిడి కలగకుండా జాగ్రత్తవహించాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్​టాప్ చూడటం వల్ల భవిష్యత్తులో శారీరక, మానసిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.