మనలో ఉన్న మానసిక ఒత్తిడిని పారదోలి.. మనసును ఉల్లాసంగా ఉంచడానికి యోగా ఔషధంలా పనిచేస్తుంది. చాలా మంది వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను కట్టడి చేసుకునేందుకు దీనిని అస్త్రంలా ఉపయోగిస్తుంటారు. ఓ గంట సేపు యోగా చేస్తే చాలు శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని నిపుణులు పేర్కొంటారు.
ఇన్ని సద్గుణాలు ఉన్న ఈ యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవడం ఎంతో అవసరం. ఇందుకోసమే హితుల్స్ హోలిస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఆన్లైన్ క్లాసులను నిర్వహించనున్నారు. సంస్థ వ్యవస్థాపకులైన డాక్టర్ వైవీ రత్నా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా యోగా పట్ల మరింత అవగాహన కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఎప్పుడు?
జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే ఆన్లైన్ వేదికగా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి హాజరవ్వాలి అనుకునే వారు గూగుల్ మీట్ ద్వారా ఈ లింక్ https://meet.google.com/mcv-arfd-enu మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి : శ్వాసతో కరోనాను శాసించండి ఇలా..