ETV Bharat / sukhibhava

Covid nails: వేలి గోళ్లు రంగు మారుతున్నాయా?

author img

By

Published : Jun 10, 2021, 11:54 AM IST

కరోనా వైరస్(Corona Virus)​ బారిన పడితే సాధారణంగా జ్వరం, దగ్గు, వాసన కోల్పోవటం వంటివి కనిపించే లక్షణాలు. తాజాగా..కొవిడ్​ బారినపడిన రోగుల్లో వేలి గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు వంటివి గుర్తించారు శాస్త్రవేత్తలు.

Covid nails
వేసి గోళ్లలో మార్పు

కొవిడ్​(Covid-19) వైరస్​ సోకితే ప్రధానంగా జ్వరం, దగ్గు, అలసట, రుచి, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపైనా కొవిడ్​ ప్రభావం చూపుతున్నట్లు మనకు తెలుసు. కానీ, శరీరంలోని మరో భాగంపైనా కొవిడ్​ ప్రభావం చూపుతోంది. అవే వేలి గోళ్లు.

కొవిడ్​ సోకిన కొంత మందిలో వేలి గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు వంటివి కనిపించాయి. గోళ్లపై ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడటం ఒక లక్షణం. ఇది వేళ్లలో ఏర్పడే మార్పులో తొలి దశ. కొవిడ్​ బారిన పడిన రెండు వారాల్లోపే ఇది కనిపిస్తోంది. ఇలా రంగు మారిన వాటిని కొవిడ్​ గోళ్లు(COVID nails)గా చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసులు బయటపడ్డాయి. ఎర్రటి అర్ధ చంద్రాకారం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే.. గోరు ప్రారంభంలో ఏర్పడినట్లు గతంలో కనిపించలేదు. ఇలాంటి.. ఆకృతి గోళ్లపై కనిపిస్తే అది కొవిడ్​-19 లక్షణాలు ఉన్నట్లుగానే భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వైరస్​ ప్రభావానికి గురైన రక్త నాళాల వల్ల ఏర్పడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే.. వైరస్​పై రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం వల్ల రక్తం గట్టకట్టడం, రంగు మారటమూ జరగొచ్చని తెలిపారు.

ఇలాంటివి ఏర్పడినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. కొవిడ్​ లక్షణాలు లేని వారిలో ఒక వారం నుంచి నాలుగు వారాల్లో మాయమవుతున్నట్లు చెప్పారు.

శారీరక ఒత్తిడి సంకేతాలు..

కొంతమంది రోగుల్లో చేతి వేళ్లు, కాలి గోళ్లలో గుంటలు పడటం గుర్తించారు. వాటిని బ్యూలైన్స్​ అంటారు. ఇవి కొవిడ్​ బారిన పడిన నాలుగు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తర్వాత కనిపించాయి. ఇన్​ఫెక్షన్లు, పోషకాహారలోపం, ఔషధాల దుష్ప్రభావలతో ఏర్పడే శారీరక ఒత్తిడి కారణంగా గోళ్ల పెరుగుదలపై ప్రభావం చూపటం వల్ల ఈ బ్యూలైన్స్​ ఏర్పడుతుంటాయి. గోళ్లు నెలకు సగటున 2ఎంఎం నుంచి 5 ఎంఎం పెరుగుతాయి. 4-5 వారాల తర్వాత బ్యూలైన్స్​ కనిపిస్తాయి.

ఇతర అసాధారణ లక్షణాలు..

గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు మాత్రమే కాదు.. మరి కొన్ని లక్షణాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఓ మహిళా రోగి గోళ్లు మూడు నెలల తర్వాత వదులుగా మారి ఊడిపోయాయి. దీనిని ఒనికోమాడెసిస్(గోళ్లు రాలిపోవటం) అంటారు. ఇది కూడా బ్యూలైన్స్​ ఏర్పడేందుకు కారణమవుతోంది. అయితే.. ఆ రోగి ఈ లక్షణాలు చికిత్స తీసుకోకుండానే కొద్ది రోజుల్లో మళ్లీ పెరిగాయి. మరో రోగి.. కొవిడ్​ పాజిటివ్​గా తేలిన 112 రోజుల తర్వాత గోళ్ల చివరన ఆరెంజ్​ కలర్​కు మారటం కనిపించింది. చికిత్స తీసుకోకపోవటం వల్ల నెల రోజులైనా అదే రంగులో ఉన్నాయి. ఇందుకు కారణాలు తెలియరాలేదు.

మరో కేసులో గోళ్లపై అడ్డంగా తెల్లటి గీతలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతానికి ఇది రహస్యమే!

ఈ మూడు పరిస్థితులు కొవిడ్​-19 బారినపడిన తర్వాత కనిపించాయి. అయితే.. కొద్ది మందినే శాస్త్రవేత్తలు పరిశీలించారు. కొవిడ్​ కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అనేది స్పష్టంగా చెప్పేందుకు లేదని తెలిపారు. కొవిడ్​ బారిన పడిన ప్రతిఒక్కరిలో ఈ లక్షణాలు కనిపించవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: లక్షణాల్లో తికమక.. ఆఖరి నిమిషంలో ఆగమాగం

కొవిడ్​(Covid-19) వైరస్​ సోకితే ప్రధానంగా జ్వరం, దగ్గు, అలసట, రుచి, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపైనా కొవిడ్​ ప్రభావం చూపుతున్నట్లు మనకు తెలుసు. కానీ, శరీరంలోని మరో భాగంపైనా కొవిడ్​ ప్రభావం చూపుతోంది. అవే వేలి గోళ్లు.

కొవిడ్​ సోకిన కొంత మందిలో వేలి గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు వంటివి కనిపించాయి. గోళ్లపై ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడటం ఒక లక్షణం. ఇది వేళ్లలో ఏర్పడే మార్పులో తొలి దశ. కొవిడ్​ బారిన పడిన రెండు వారాల్లోపే ఇది కనిపిస్తోంది. ఇలా రంగు మారిన వాటిని కొవిడ్​ గోళ్లు(COVID nails)గా చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసులు బయటపడ్డాయి. ఎర్రటి అర్ధ చంద్రాకారం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే.. గోరు ప్రారంభంలో ఏర్పడినట్లు గతంలో కనిపించలేదు. ఇలాంటి.. ఆకృతి గోళ్లపై కనిపిస్తే అది కొవిడ్​-19 లక్షణాలు ఉన్నట్లుగానే భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వైరస్​ ప్రభావానికి గురైన రక్త నాళాల వల్ల ఏర్పడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే.. వైరస్​పై రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం వల్ల రక్తం గట్టకట్టడం, రంగు మారటమూ జరగొచ్చని తెలిపారు.

ఇలాంటివి ఏర్పడినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. కొవిడ్​ లక్షణాలు లేని వారిలో ఒక వారం నుంచి నాలుగు వారాల్లో మాయమవుతున్నట్లు చెప్పారు.

శారీరక ఒత్తిడి సంకేతాలు..

కొంతమంది రోగుల్లో చేతి వేళ్లు, కాలి గోళ్లలో గుంటలు పడటం గుర్తించారు. వాటిని బ్యూలైన్స్​ అంటారు. ఇవి కొవిడ్​ బారిన పడిన నాలుగు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తర్వాత కనిపించాయి. ఇన్​ఫెక్షన్లు, పోషకాహారలోపం, ఔషధాల దుష్ప్రభావలతో ఏర్పడే శారీరక ఒత్తిడి కారణంగా గోళ్ల పెరుగుదలపై ప్రభావం చూపటం వల్ల ఈ బ్యూలైన్స్​ ఏర్పడుతుంటాయి. గోళ్లు నెలకు సగటున 2ఎంఎం నుంచి 5 ఎంఎం పెరుగుతాయి. 4-5 వారాల తర్వాత బ్యూలైన్స్​ కనిపిస్తాయి.

ఇతర అసాధారణ లక్షణాలు..

గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు మాత్రమే కాదు.. మరి కొన్ని లక్షణాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఓ మహిళా రోగి గోళ్లు మూడు నెలల తర్వాత వదులుగా మారి ఊడిపోయాయి. దీనిని ఒనికోమాడెసిస్(గోళ్లు రాలిపోవటం) అంటారు. ఇది కూడా బ్యూలైన్స్​ ఏర్పడేందుకు కారణమవుతోంది. అయితే.. ఆ రోగి ఈ లక్షణాలు చికిత్స తీసుకోకుండానే కొద్ది రోజుల్లో మళ్లీ పెరిగాయి. మరో రోగి.. కొవిడ్​ పాజిటివ్​గా తేలిన 112 రోజుల తర్వాత గోళ్ల చివరన ఆరెంజ్​ కలర్​కు మారటం కనిపించింది. చికిత్స తీసుకోకపోవటం వల్ల నెల రోజులైనా అదే రంగులో ఉన్నాయి. ఇందుకు కారణాలు తెలియరాలేదు.

మరో కేసులో గోళ్లపై అడ్డంగా తెల్లటి గీతలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతానికి ఇది రహస్యమే!

ఈ మూడు పరిస్థితులు కొవిడ్​-19 బారినపడిన తర్వాత కనిపించాయి. అయితే.. కొద్ది మందినే శాస్త్రవేత్తలు పరిశీలించారు. కొవిడ్​ కారణంగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అనేది స్పష్టంగా చెప్పేందుకు లేదని తెలిపారు. కొవిడ్​ బారిన పడిన ప్రతిఒక్కరిలో ఈ లక్షణాలు కనిపించవని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: లక్షణాల్లో తికమక.. ఆఖరి నిమిషంలో ఆగమాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.