ETV Bharat / sukhibhava

ఆరోగ్య అసమానతలు పారదోలే దిశగా..

తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు ఆరోగ్య కార్యకర్తలు. బుధవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వారికి కృతజ్ఙతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ ఆరోగ్య దినం వైద్యులు, పరిచారికలు, మొత్తం వైద్యరంగ నిపుణులకు అంకితమివ్వాల్సిన తరుణమిది.

author img

By

Published : Apr 7, 2021, 10:29 PM IST

celebrating world health day 2021 amidst covid pandemic
కోవిడ్ నేపద్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

మెరుగైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ఏప్రిల్ 7న అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రజల్లో ఉన్న ఆరోగ్య అసమానతలను పారదోలాలని, ఆ దిశగా ఈ సంవత్సరమంతా జరిపే కార్యాచరణతో నవసమాజాన్ని నిర్మించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, జాతి వివక్ష లేకుండా అత్యున్నత ఆరోగ్య స్థాయిని పొందటం ప్రతి మనిషికి ఉన్న ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగ అధికరణ ప్రకటిస్తోంది.

సంక్షిప్తంగా కొంత చరిత్ర:

ఒక స్వతంత్ర, సంపూర్ణ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ స్థాపించాలని బ్రెజిల్, చైనా దేశాలు డిసెంబర్ 1945లో ప్రతిపాదించాయి. ఆ తరువాత జూలై 1946లో న్యూయార్క్ నగరంలో ఆ ప్రతిపాదన ఆమోదించబడి, ఏప్రిల్7, 1948న 61 దేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1949, 22 జులై ప్రపంచ ఆరోగ్య దినాన్ని పాటించినా.. తరువాత ఏప్రిల్7ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఈ క్రమంలో 1950లో మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని జరుపుకున్నాం. ఈ దినాన్ని జరుపుకోవటం వెనుక ఉద్దేశ్యం ప్రపంచ ఆరోగ్యాన్ని పీడిస్తున్న సమస్యల గురించి ప్రపంచ ప్రజలందరిలోనూ వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది.

ప్రస్తుత ఆరోగ్య గణాంకాలు:

  • గత రెండు దశాబ్దాల్లో మొదటి సారిగా ప్రపంచ వ్యాప్తంగా పేదల సంఖ్య పెరుగుతున్నట్టుగా గుర్తించి అది నిలకడ గల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నట్టుగా తెలిసింది.
  • కొన్ని దేశాల్లో నివసించే 60% మంది జనాభాకు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.
  • సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు తాత్కాలిక ఆవాసాల్లో లేదా మురికి వాడల్లో నివసిస్తూ నిత్యం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి లాంటి వాటిని నివారించటం కూడా కష్టమే.

కోవిడ్ వేళ.. ప్రపంచ ఆరోగ్య దినం:

కోవిడ్ మహమ్మారి నియంత్రణలో దేశమంతా మునిగి ఉండగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈటీవీ భారత్ సుఖీభవ బృందం కొత్త రకాల కరోనా వైరస్ ల గురించి, వాటి వ్యాప్తి గురించి వైద్యులతో చర్చించింది.

ఇండోర్ నగరంలో అపోలో ఆసుపత్రిలో వైద్యుడైన డా. సంజయ్ కె. జైన్, ఎండీ కోవిడ్-19 వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ తరుచూ తన నిర్మాణాన్ని మార్చుకుంటుందని, అది సహజమని దాన్ని ఉత్పరివర్తనం అంటారని చెప్పారు. అందువల్ల మారిన వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్రమైన నొప్పులు, బొంగురు గొంతు, పొడి దగ్గు, జలుబు లాంటి లక్షణాలను కలుగజేస్తోంది. ఆశ్చర్యకరంగా కొందరిలో వైరస్ ప్రవేశించినా.. వ్యాధి లక్షణాలు కనిపించని పరిస్థితి ఉంది. వీరికి ప్రాణాపాయం లేకపోయినా వీరి వల్ల వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అందువల్ల ఎక్కువ ఆసుపత్రి పడకలు అవసరమవుతాయి. సాపేక్షంగా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఎముకల వైద్యంలో నిష్ణాతులైన డా.హేమ్ జోషి ప్రకారం ఆసుపత్రులను సందర్శిస్తున్న రోగుల కుటుంబాలు కోవిడ్ పాజిటివ్​గా ఉన్నాయి. లక్షణాలు కనిపించకుండా వైరస్ ఉన్న రోగులు ఇంటి దగ్గరే ఉంటూ, ఔషధాలు తీసుకుంటూ, అన్ని నిబంధనలను పాటిస్తూ ఇతరులకు వ్యాధిని సంక్రమింపచేయకుండా ఉండాలి.

కోవిడ్ వ్యాధి ప్రారంభ దశల్లో అది చిన్న పిల్లలకు సోకదని, వారికి నిరోధక శక్తి ఉంటుందని అనుకున్నామని చిన్న పిల్లల వైద్యులు డా. సొనాలి నౌలే పురందరే చెప్పారు. కానీ ఈ రెండో దశలో పిల్లల్లో కూడా కరోనా వ్యాపిస్తుందని, రెండు మూడు నెలల పిల్లలకు కూడా వైరస్ సోకుతోందని వారిలో లక్షణాలు వేరుగా ఉంటున్నాయని చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం వీరిలోనూ సాధారణ లక్షణాలు.

మరో చిన్న పిల్లల వైద్యురాలు డా. లతికా జోషి ప్రకారం శిశువుల్లో కరోనా లక్షణాలు గమనించకపోతే వైరస్ ను వ్యాపింపచేయటంలో వారు ముందుంటారని చెప్పారు. అందువల్ల చిన్న పిల్లల్లో కొద్దిగా లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి.

కరోనా వల్ల ప్రజల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని డెహ్రాడూన్ కి చెందిన డా. వీణా కృష్ణన్ తెలియచేస్తున్నారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ టీకా కార్యక్రమం పుంజుకోవటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని అందరూ భావించారు. కానీ వ్యాధి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన, వ్యాకులత పెరుగుతున్నాయి. నిరాశాజనక పరిస్థితుల్లోకి జారిపోతున్నారు. దీని ద్వారా మానసిక జబ్బులు సంఖ్య పెరగకపోయినా ఆందోళన చెందే వారి సంఖ్య బాగా పెరిగింది.

ఉత్పరివర్తనం చెందిన వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో మనం అజాగ్రత్తగా ఉండరాదు. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంతే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అబద్ధాల ప్రచారాలను చదవకండి, నమ్మకండి. టీకాల గురించి అవాస్తవ ప్రచారాలను కూడా దరిచేరనీయవద్దు.

టీకాలు సురక్షితమైనవి కావున టీకా తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మొత్తం ప్రపంచాన్ని కోవిడ్-19 భయపెడుతోంది. ఆర్ధికంగా బలహీన వర్గాల వారు, సామాజికంగా వెనుకబడిన వారు దీని ప్రభావానికి లోను కావచ్చు.

ప్రపంచ ఆరోగ్య దినం నినాదం ప్రకారం మనందరం ఐకమత్యంగా పనిచేస్తూ, ఆరోగ్య అసమానతలను అధిగమించి అందరికీ సరైన సమయంలో ఆరోగ్య సేవలు అందేట్టుగా కృషి చేయాలి.

మెరుగైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ఏప్రిల్ 7న అన్ని దేశాలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రజల్లో ఉన్న ఆరోగ్య అసమానతలను పారదోలాలని, ఆ దిశగా ఈ సంవత్సరమంతా జరిపే కార్యాచరణతో నవసమాజాన్ని నిర్మించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, జాతి వివక్ష లేకుండా అత్యున్నత ఆరోగ్య స్థాయిని పొందటం ప్రతి మనిషికి ఉన్న ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ రాజ్యాంగ అధికరణ ప్రకటిస్తోంది.

సంక్షిప్తంగా కొంత చరిత్ర:

ఒక స్వతంత్ర, సంపూర్ణ అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ స్థాపించాలని బ్రెజిల్, చైనా దేశాలు డిసెంబర్ 1945లో ప్రతిపాదించాయి. ఆ తరువాత జూలై 1946లో న్యూయార్క్ నగరంలో ఆ ప్రతిపాదన ఆమోదించబడి, ఏప్రిల్7, 1948న 61 దేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1949, 22 జులై ప్రపంచ ఆరోగ్య దినాన్ని పాటించినా.. తరువాత ఏప్రిల్7ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. ఈ క్రమంలో 1950లో మొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య దినాన్ని జరుపుకున్నాం. ఈ దినాన్ని జరుపుకోవటం వెనుక ఉద్దేశ్యం ప్రపంచ ఆరోగ్యాన్ని పీడిస్తున్న సమస్యల గురించి ప్రపంచ ప్రజలందరిలోనూ వ్యాప్తంగా ఒక అవగాహన కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది.

ప్రస్తుత ఆరోగ్య గణాంకాలు:

  • గత రెండు దశాబ్దాల్లో మొదటి సారిగా ప్రపంచ వ్యాప్తంగా పేదల సంఖ్య పెరుగుతున్నట్టుగా గుర్తించి అది నిలకడ గల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నట్టుగా తెలిసింది.
  • కొన్ని దేశాల్లో నివసించే 60% మంది జనాభాకు అత్యవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు.
  • సుమారు 100 కోట్లకు పైగా ప్రజలు తాత్కాలిక ఆవాసాల్లో లేదా మురికి వాడల్లో నివసిస్తూ నిత్యం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి లాంటి వాటిని నివారించటం కూడా కష్టమే.

కోవిడ్ వేళ.. ప్రపంచ ఆరోగ్య దినం:

కోవిడ్ మహమ్మారి నియంత్రణలో దేశమంతా మునిగి ఉండగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈటీవీ భారత్ సుఖీభవ బృందం కొత్త రకాల కరోనా వైరస్ ల గురించి, వాటి వ్యాప్తి గురించి వైద్యులతో చర్చించింది.

ఇండోర్ నగరంలో అపోలో ఆసుపత్రిలో వైద్యుడైన డా. సంజయ్ కె. జైన్, ఎండీ కోవిడ్-19 వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ తరుచూ తన నిర్మాణాన్ని మార్చుకుంటుందని, అది సహజమని దాన్ని ఉత్పరివర్తనం అంటారని చెప్పారు. అందువల్ల మారిన వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ తీవ్రమైన నొప్పులు, బొంగురు గొంతు, పొడి దగ్గు, జలుబు లాంటి లక్షణాలను కలుగజేస్తోంది. ఆశ్చర్యకరంగా కొందరిలో వైరస్ ప్రవేశించినా.. వ్యాధి లక్షణాలు కనిపించని పరిస్థితి ఉంది. వీరికి ప్రాణాపాయం లేకపోయినా వీరి వల్ల వైరస్ వ్యాప్తి చెందవచ్చు. అందువల్ల ఎక్కువ ఆసుపత్రి పడకలు అవసరమవుతాయి. సాపేక్షంగా మరణాల సంఖ్య తక్కువగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఎముకల వైద్యంలో నిష్ణాతులైన డా.హేమ్ జోషి ప్రకారం ఆసుపత్రులను సందర్శిస్తున్న రోగుల కుటుంబాలు కోవిడ్ పాజిటివ్​గా ఉన్నాయి. లక్షణాలు కనిపించకుండా వైరస్ ఉన్న రోగులు ఇంటి దగ్గరే ఉంటూ, ఔషధాలు తీసుకుంటూ, అన్ని నిబంధనలను పాటిస్తూ ఇతరులకు వ్యాధిని సంక్రమింపచేయకుండా ఉండాలి.

కోవిడ్ వ్యాధి ప్రారంభ దశల్లో అది చిన్న పిల్లలకు సోకదని, వారికి నిరోధక శక్తి ఉంటుందని అనుకున్నామని చిన్న పిల్లల వైద్యులు డా. సొనాలి నౌలే పురందరే చెప్పారు. కానీ ఈ రెండో దశలో పిల్లల్లో కూడా కరోనా వ్యాపిస్తుందని, రెండు మూడు నెలల పిల్లలకు కూడా వైరస్ సోకుతోందని వారిలో లక్షణాలు వేరుగా ఉంటున్నాయని చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం వీరిలోనూ సాధారణ లక్షణాలు.

మరో చిన్న పిల్లల వైద్యురాలు డా. లతికా జోషి ప్రకారం శిశువుల్లో కరోనా లక్షణాలు గమనించకపోతే వైరస్ ను వ్యాపింపచేయటంలో వారు ముందుంటారని చెప్పారు. అందువల్ల చిన్న పిల్లల్లో కొద్దిగా లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి.

కరోనా వల్ల ప్రజల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందని డెహ్రాడూన్ కి చెందిన డా. వీణా కృష్ణన్ తెలియచేస్తున్నారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ టీకా కార్యక్రమం పుంజుకోవటంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని అందరూ భావించారు. కానీ వ్యాధి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన, వ్యాకులత పెరుగుతున్నాయి. నిరాశాజనక పరిస్థితుల్లోకి జారిపోతున్నారు. దీని ద్వారా మానసిక జబ్బులు సంఖ్య పెరగకపోయినా ఆందోళన చెందే వారి సంఖ్య బాగా పెరిగింది.

ఉత్పరివర్తనం చెందిన వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో మనం అజాగ్రత్తగా ఉండరాదు. పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంతే కాకుండా మన మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో జరిగే అబద్ధాల ప్రచారాలను చదవకండి, నమ్మకండి. టీకాల గురించి అవాస్తవ ప్రచారాలను కూడా దరిచేరనీయవద్దు.

టీకాలు సురక్షితమైనవి కావున టీకా తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మొత్తం ప్రపంచాన్ని కోవిడ్-19 భయపెడుతోంది. ఆర్ధికంగా బలహీన వర్గాల వారు, సామాజికంగా వెనుకబడిన వారు దీని ప్రభావానికి లోను కావచ్చు.

ప్రపంచ ఆరోగ్య దినం నినాదం ప్రకారం మనందరం ఐకమత్యంగా పనిచేస్తూ, ఆరోగ్య అసమానతలను అధిగమించి అందరికీ సరైన సమయంలో ఆరోగ్య సేవలు అందేట్టుగా కృషి చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.