ETV Bharat / sukhibhava

గ్యాస్ట్రిక్, ఎసిడిటీ - ఈ యోగ ముద్రతో జీర్ణ సమస్యలన్నీ ఖతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 12:00 PM IST

Updated : Feb 7, 2024, 12:46 PM IST

Yoga for Good Digestion : ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్.. గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ. ఇవి తలెత్తడానికి ప్రధాన కారణం తీసుకున్న ఆహారం సరైన టైమ్​లో జీర్ణం కాకపోవడమే. అందుకోసం చాలా మంది ఏవేవో ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అవి ఆరోగ్యంపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారు ఈ యోగ ముద్రను ట్రై చేశారంటే ఆ సమస్యలన్నీ ఇట్టే తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Yoga
Yoga for Good Digestion

Best Yoga Pose for Better Digestion : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. అయితే.. మంచి ఫుడ్ తీసుకుంటేనే సరిపోదు.. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయినప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మన బాడీలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే.. జీర్ణవ్యవస్థ(Digestion System) పర్ఫెక్ట్​గా ఉండాలి. లేదంటే.. ఎన్నో సమస్యలు వస్తాయి.

Yoga for Good Digestion : కానీ.. చాలా మందిలో జీర్ణక్రియ గాడితప్పుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక జీర్ణాశయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తింటున్న తిండి సరిగ్గా జీర్ణం కాకపోవడమే. అయితే.. అలాంటి వారికోసం ఆరోగ్య నిపుణులు సూచించిన బెస్ట్ యోగముద్రను తీసుకొచ్చాం. తిన్న తర్వాత దీనిని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా ఆహారం జీర్ణం కావడమే కాకుండా మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ అదెంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు ఆరోగ్యంగా ఉండడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న యోగాసనం.. వజ్రాసనంలో కూర్చుని పూషన్ ముద్ర వేయడం. వజ్రాసనాన్నే థండర్ బోల్ట్ ఫోజ్ లేదా డైమండ్ ఫోజ్ అని కూడా అంటారు. యోగాసనాలలో తిన్న వెంటనే చేయగలిగే ఏకైక భంగిమ.. వజ్రాసనం అని చెప్పుకోవచ్చు. దీనిని భోజనం తర్వాత వేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు పూషన్ ముద్ర వేయండి. దీని ద్వారా మరిన్ని హెల్తీ బెనిఫిట్స్ లభిస్తాయి.

ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఈ పూషన్ ముద్ర ఎలా వేయాలంటే..

ముందుగా వజ్రాసనం వేయాలి. తర్వాత మీ కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలును ఒక్క దగ్గరికి చేర్చాలి. అలాగే ఎడమ చేతి బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలును ఒక దగ్గరికి చేర్చి ఆసనంలో కూర్చోవాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ భంగిమను ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు 15 నిమిషాల వరకు పెంచుకుంటూ పోవడం ద్వారా బెటర్ రిజల్ట్స్ పొందుతారు.

ఇకపోతే ఈ పూషన్ ముద్ర వేయడం ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటే.. ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎన్నో జీర్ణాశయ సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కటి కండరాలను బలపరుస్తుంది. అలాగే వికారం, ఆపానవాయువు వంటి సమస్యలు నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ ఆసనం ఎలా వేయాలనే క్లారిటీ లేనివారు తెలిసిన వారి నుంచి నేర్చుకున్న తర్వాతనే వేయండి.

బీకేర్​ఫుల్ : ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు నీరు తాగకండి! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!

Best Yoga Pose for Better Digestion : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. అయితే.. మంచి ఫుడ్ తీసుకుంటేనే సరిపోదు.. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయినప్పుడే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మన బాడీలోని వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలంటే.. జీర్ణవ్యవస్థ(Digestion System) పర్ఫెక్ట్​గా ఉండాలి. లేదంటే.. ఎన్నో సమస్యలు వస్తాయి.

Yoga for Good Digestion : కానీ.. చాలా మందిలో జీర్ణక్రియ గాడితప్పుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక జీర్ణాశయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తింటున్న తిండి సరిగ్గా జీర్ణం కాకపోవడమే. అయితే.. అలాంటి వారికోసం ఆరోగ్య నిపుణులు సూచించిన బెస్ట్ యోగముద్రను తీసుకొచ్చాం. తిన్న తర్వాత దీనిని డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా త్వరగా ఆహారం జీర్ణం కావడమే కాకుండా మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరగుపరుచుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ అదెంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీరు ఆరోగ్యంగా ఉండడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న యోగాసనం.. వజ్రాసనంలో కూర్చుని పూషన్ ముద్ర వేయడం. వజ్రాసనాన్నే థండర్ బోల్ట్ ఫోజ్ లేదా డైమండ్ ఫోజ్ అని కూడా అంటారు. యోగాసనాలలో తిన్న వెంటనే చేయగలిగే ఏకైక భంగిమ.. వజ్రాసనం అని చెప్పుకోవచ్చు. దీనిని భోజనం తర్వాత వేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు పూషన్ ముద్ర వేయండి. దీని ద్వారా మరిన్ని హెల్తీ బెనిఫిట్స్ లభిస్తాయి.

ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

ఈ పూషన్ ముద్ర ఎలా వేయాలంటే..

ముందుగా వజ్రాసనం వేయాలి. తర్వాత మీ కుడి చేతి బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలును ఒక్క దగ్గరికి చేర్చాలి. అలాగే ఎడమ చేతి బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలును ఒక దగ్గరికి చేర్చి ఆసనంలో కూర్చోవాలి. ఇలా 3 నుంచి 5 నిమిషాల పాటు ఈ భంగిమను ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు 15 నిమిషాల వరకు పెంచుకుంటూ పోవడం ద్వారా బెటర్ రిజల్ట్స్ పొందుతారు.

ఇకపోతే ఈ పూషన్ ముద్ర వేయడం ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటే.. ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎన్నో జీర్ణాశయ సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కటి కండరాలను బలపరుస్తుంది. అలాగే వికారం, ఆపానవాయువు వంటి సమస్యలు నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ ఆసనం ఎలా వేయాలనే క్లారిటీ లేనివారు తెలిసిన వారి నుంచి నేర్చుకున్న తర్వాతనే వేయండి.

బీకేర్​ఫుల్ : ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు నీరు తాగకండి! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!

Last Updated : Feb 7, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.