ETV Bharat / state

మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం.. ఆ తర్వాతే దర్శనాలకు అనుమతి: ఈవో

author img

By

Published : Mar 18, 2022, 12:27 PM IST

Updated : Mar 18, 2022, 12:46 PM IST

Yadadri Maha Kumbha Samprokshanam: యాదాద్రీశుని సన్నిధిలో శ్రీ సుదర్శన నారసింహ మహా యాగం, మహా కుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగం ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. 28న మహా కుంభ సంప్రోక్షణ అనంతరం మూలమూర్తుల దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

yadadri temple reconstruction
యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

Yadadri Maha Kumbha Samprokshanam: యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 28న పూర్ణాహుతి తర్వాత ఉదయం 11.50 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని వివరించారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని ఈవో స్పష్టం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం: ఈవో గీతా రెడ్డి

అన్ని ఏర్పాట్లు పూర్తి

Sudarshan Maha yagam: 21 వ తేదీ నుంచి ఆలయ ప్రాంగణలో శ్రీ సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆరోజు ఉదయం 9 గంటలకు అంకుర్పారణతో యాగం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాలు జరుగుతాయని వివరించారు. యాగశాలల నిర్మాణం రేపటికి పూర్తవుతుందని ఈవో తెలిపారు. పండితులు, అర్చకులు యాదాద్రి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 20 నాటికి అర్చకులు ఆలయం చేరుకుంటారని.. జపాలు, పారాయణాల కోసం ప్రధానార్చకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

ఆ తర్వాతే దర్శనాలు

"ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు. 21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది. రోజూ ఉ.9 నుంచి మ.12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. రోజూ సా.6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాల నిర్వహణ ఉంటుంది." -గీతా రెడ్డి, ఆలయ ఈవో

ఆర్జిత సేవలు రద్దు

సుదర్శన మహా యాగం సందర్భంగా బాలాలయంలో సుదర్శన హోమం, కల్యాణం, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతా రెడ్డి పేర్కొన్నారు. భక్తులు పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించుకోవాలని.. ఈనెల 21 నుంచి యాగశాలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బాలాలయంలో స్వామివారి దర్శనాలు ఆపడం లేదని.. 27 వరకు యథావిధిగా దర్శనాలు ఉంటాయని వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగితేలుతున్న జనం

Yadadri Maha Kumbha Samprokshanam: యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. 28న పూర్ణాహుతి తర్వాత ఉదయం 11.50 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ చేపడతామని వివరించారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని ఈవో స్పష్టం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం: ఈవో గీతా రెడ్డి

అన్ని ఏర్పాట్లు పూర్తి

Sudarshan Maha yagam: 21 వ తేదీ నుంచి ఆలయ ప్రాంగణలో శ్రీ సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆరోజు ఉదయం 9 గంటలకు అంకుర్పారణతో యాగం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయని.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాలు జరుగుతాయని వివరించారు. యాగశాలల నిర్మాణం రేపటికి పూర్తవుతుందని ఈవో తెలిపారు. పండితులు, అర్చకులు యాదాద్రి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈనెల 20 నాటికి అర్చకులు ఆలయం చేరుకుంటారని.. జపాలు, పారాయణాల కోసం ప్రధానార్చకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

ఆ తర్వాతే దర్శనాలు

"ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు. 21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది. రోజూ ఉ.9 నుంచి మ.12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. రోజూ సా.6 నుంచి రాత్రి 8.30 వరకు యాగాల నిర్వహణ ఉంటుంది." -గీతా రెడ్డి, ఆలయ ఈవో

ఆర్జిత సేవలు రద్దు

సుదర్శన మహా యాగం సందర్భంగా బాలాలయంలో సుదర్శన హోమం, కల్యాణం, ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈవో గీతా రెడ్డి పేర్కొన్నారు. భక్తులు పాతగుట్ట ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించుకోవాలని.. ఈనెల 21 నుంచి యాగశాలలో స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బాలాలయంలో స్వామివారి దర్శనాలు ఆపడం లేదని.. 27 వరకు యథావిధిగా దర్శనాలు ఉంటాయని వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు.. రంగుల్లో మునిగితేలుతున్న జనం

Last Updated : Mar 18, 2022, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.